Pawan Kalyan : పవన్ కల్యాణ్ను కలిసిన ప్రొడ్యూసర్స్ - సింగిల్ స్క్రీన్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూపై...
Pawan Kalyan Reaction : టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిశారు. సింగిల్ స్క్రీన్స్, పర్సంటేజీ విధానం, సినీ రంగ సమస్యలను ఆయనకు వివరించారు.

Telugu Producers Meets AP Deputy CM Pawan Kalyan : టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మంగళవారం కలిశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న పవన్ను కలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఇబ్బందులు, సినీ పరిశ్రమ సమస్యలను వివరించారు.
ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారంటే?
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, రవి శంకర్, సాహు గారపాటి తదితరులు పవన్తో భేటీ అయ్యారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయని... వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మల్టీ ఫ్లెక్స్ తరహాలోనే వచ్చిన లాభాల్లో ప్రొడ్యూసర్స్ నుంచి పర్సంటేజీ విధానం అమలు చేస్తే థియేటర్స్ నిలబడతాయని అన్నారు. ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైన పాలసీ రూపొందించాలని కోరారు.
కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం పెరిగిందని, నెల వారీ ఖర్చులు కూడా పెరిగాయని చెప్పారు. విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం ద్వారా థియేటర్ యజమానులపై భారం తగ్గుతుందని అన్నారు.
పవన్ రియాక్షన్
ప్రొడ్యూసర్స్ చెప్పిన సమస్యలు విన్న పవన్ కల్యాణ్ సానూకులంగా స్పందించారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని... ప్రొడ్యూసర్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు పవన్ సూచించారు. మరోవైపు, సోమవారం సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజీ విషయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఎగ్జిబిటర్స్ సోమవారం మెగాస్టార్ చిరంజీవిని కలిసి చర్చించారు.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి రావాలని... రాబోయే చిత్రాలకు ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు చిరు. ఛాంబర్ వేసిన కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు తన వంతు సాయం చేస్తానన్నారు మెగాస్టార్.
Also Read : బండ్ల గణేష్ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























