అన్వేషించండి

Andhra Pradesh: 2020లోనే కూటమి బలాన్ని రుచి చూపిన తూర్పు గోదావరి ప్రజలు

East Godavari News: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో 2020లోనే నాయకులకు, పార్టీలకు శాంపిల్‌ చూపించారు తూర్పుగోదావరి ప్రజలు.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు కూటమికి నాంది పలికిన ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే అని మీకు తెలుసా.
కూటమి ఏర్పాటుకు బీజం పడింది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత నారా చంద్రబాబును అరెస్ట్‌ చేసి రాజమండ్రి జైలులో అని చాలా మంది అనుకుంటారు. కూటమిగా పోటీ చేస్తున్నామని పోటీ చేస్తామి బహిరంగంగా చెప్పేందుకు రాజమండ్రిని పవన్‌ కల్యాణ్‌ వేదికగా చేసుకున్నారు. 

కానీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కూటమిగా పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. కూటమిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో స్థానిక సంస్థల ఎన్నికలు చెప్పాయి. అప్పట్లో ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోలేదు. ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీ మాత్రం గమనించి దానికి తగ్గట్టుగానే పావులు కదిపాయి. 

మార్పుకు నాంది తూర్పునే...
2020లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల టీడీపీ, జనసేన లోపాయికర ఒప్పందంతో పని చేశాయి. ఎన్నికల్లో కలిసి పనిచేసి చాలాచోట్ల విజయాన్ని సాధించాయి. నిజానికి అప్పటికి టీడీపీ, జనసేన కలిసే ప్రయాణం చేస్తాయన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాలేదు. పైన ఎలా ఉన్నా మాత్రం గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ, జనసేన నాయకులు ఓ నిర్ణయానికి వచ్చి బరిలో నిలిచి విజయం సాధించారు. 

ఇలాంటి ప్రాంతాల్లో మొదటి గ్రామం కడియం. ఈ గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు ముందుగా ఓ నిర్ణయానికి వచ్చి వైసీపీ నిలిపిన అభ్యర్ధిని ఓడించారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమ పార్టీ వారిపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా టీడీపీ శ్రేణులు పాల్గన్న పరిస్థితి లేదు. అలాంటి టైంలో కడియం మండలంలో చాలా గ్రామాల్లో ఇరు పార్టీలు సహకరించుకున్నాయి. కలిసి పోటీ చేసి విజయాన్ని సాధించాయి. ఇదే తరహాలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. చాలా గ్రామాల్లో విజయం సాధించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోకూడా...
రాజమహేంద్రవరం రూరల్‌ నియోకవర్గ పరిధిలో టీడీపీ, జనసేనకు బీజేపీ కూడా కలిసింది. ప్రధానంగా టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నుంచి కందుల దుర్గేష్‌, బీజేపీ నుంచి సోము వీర్రాజు కలిశారు. దీంతో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో చాలా మండల పరిషత్తులు, జడ్పీటీసీలు టీడీపీ, జనసేన, బీజేపీ పరమయ్యాయి. ఇదే పరిస్థితి పి.గన్నవరం నియోజకవర్గంలో కూడా కనిపించింది. 
స్థానిక సంస్థల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారానే వైసీపీని మట్టికరిపించామని అనుకున్నారు. ఇదే విషయంలో పార్టీ అధిష్టానంతో చర్చించలేక వారి నిర్ణయం కోసం ఎదురు చూశారు. ఇంతలో చంద్రబాబు అరెస్ట్‌ తరువాత జరిగిన పరిణామాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందుగా టీడీపీ, జనసేన కలయిక ఆపై బీజేపీ చేరడంతో కూటమికి తిరుగులేకుండా పోయింది. 

వైసీపీను వీడుతున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు..
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు యూ టర్న్ తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు వైసీపీ ప్రాధన్యత లేకుండా చేసిందని గుర్రుగా ఉన్న సర్పంచ్‌లు ఇప్పుడు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీకు గుడ్‌బై చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా పంచాయతీ సర్పంచుల్లో కదలిక వచ్చింది. కడియం మండలంలోనే పంచాయతీ సర్పంచ్‌లు వైసీపీకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇదే బాటలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అడుగులు వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్Deputy CM Pawan Kalyan on Janasena Win | జనసేనగా నిలబడ్డాం..40ఏళ్ల టీడీపీని నిలబెట్టాం | ABP DesamNaga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamJanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Yuvi 7 Sixers Vs Australia: పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Embed widget