అన్వేషించండి

Andhra Teacher MLC: ఏపీలో సైలెంట్‌గా పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికలు - ప్రధాన పార్టీలు మాత్రం దూరం !

Teacher MLC: ఏపీలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ సంఘాలు, స్వతంత్రులు మాత్రమే పోటీ చేశారు.

Teacher MLC elections of both Godavari districts in AP were held peacefully :  భయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  ఉదయం ఎనిమిది గంటలనుంచి ప్రారంభమైన ఎన్నికల పోలీంగ్‌ ప్రక్రియ అంతా సజావుగానే సాగుతోంది.. ఉభయగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఈ పోలిగ్ జరిగింది.  ప్రతీ మండల కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రతీ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేశారు అధికారులు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం బరిలో ఐదుగురు ! 

ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గంథం నారాయణరావుకు ఒకటి, దీపక్‌ పులుగుకు రెండు, డాక్టర్‌ నాగేశ్వరరావు కవలకు మూడు, నామన వెంకటలక్ష్మి(విళ్ల లక్ష్మి)కు నాలుగు, బర్రా గోపీమూర్తికి అయిదవ సంఖ్యను కేటాయించారు.  బ్యాలెట్‌ విధానంలో ఈ ఎన్నికలు జరిగాయి.  ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటును నెంబర్‌ రూపంలో వేయాల్సి ఉంది. అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యత సంఖ్య ఒకటి తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది.. లేకపోతే అది చెల్లదు.  

Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 116    

ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబందించి మొత్తం 116 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 113 మండలాల పరిధిలో 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిని రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ భవనాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరంలో అదనంగా మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 580 మంది విధులు నిర్వర్తించారు.                                     

జిల్లాల వారీగా ఓటర్లు 16,737 మంది.. 

ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి జిల్లాలో 16,737 మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 3,418, అంబేడ్కర్‌ కోనీసీమ జిల్లాలో 3,296, తూర్పుగోదావరి జిల్లాలో 2,990, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,729, ఏలూరు జిల్లాలో 2,667, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు కోసం ఉత్సాహం చూపించారు. పదిహేను వేల మంది వరకూ ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. 

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

ఉపాధ్యయ ఎమ్మెల్సీ కావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.  ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించే వారికి సహజంగా గెలుపు వస్తుంది. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీ పదవి కూడా పోటీ చేసేవారు. కానీ ఈ సారి పోటీ పెట్టలేదు.      

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget