అన్వేషించండి

Murali Mohan Politics: చంద్రబాబు ఆహ్వానం నిజమే, మురళీమోహన్ మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారా?

Andhra Pradesh News | మాజీ ఎంపీ మురళీమోహన్ రాజమండ్రిలో పర్యటించారు. చంద్రబాబు తనను రాజకీయాల్లోకి ఆహ్వానించడం నిజమేనని, కానీ పాలిటిక్స్ లోకి రావడం లేదని స్పష్టం చేశారు.

Murali Mohan in Rajahmundry | రాజమండ్రి: టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా? మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మురళీమోహన్ రాజకీయాలు చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. తన పొలిటికల్ రీఎంట్రీపై రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తనను ఆహ్వానించిన మాట నిజమనేనని, అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. 

రాజమండ్రి (Rajahmundry)కి వచ్చిన సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలను, రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని అభినందించాలని వచ్చినట్లు తెలిపారు. తన హయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్, ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేశానని, డబ్బులు ఎలా సంపాదించాలో తనకు తెలుసునని, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 

Murali Mohan Politics: చంద్రబాబు ఆహ్వానం నిజమే, మురళీమోహన్ మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారా?

వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తన మీద చేసిన ఆరోపణల్ని మురళీమోహన్ ఖండించారు. తాను ఇసుక అమ్ముకున్నానంటూ మాజీ ఎంపీ భరత్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (Rajahmundry MLA Adireddy Srinivas) రాజకీయాల్లో రాణిస్తున్నారని, ఆయనకు తన మద్దతు ఉంటుందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఎవరు శంకుస్థాపన చేశారో మాజీ ఎంపీ మార్గాని భరత్ గుండె మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ఈ ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తా అన్నారు. మార్గాని భరత్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రెస్ మీట్ ను లక్షల మంది చూస్తారని, ఆదిరెడ్డి వాసు మాట్లాడితే వేలల్లోనే చూస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్ చేశారు.

రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు కామెంట్స్
మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి మాజీ ఎంపీ మురళీమోహన్ చాలా కృషి చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అన్నారు. కానీ ఒకే నిర్మాణానికి రెండు శిలాఫలకాలు భారతదేశంలో ఎక్కడా చూడబోమని, ఏపీలో వైసీపీ పాలనతో అది సాధ్యమైందని ఎద్దేవా చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో మార్గాని భరత్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నారు. ఒకవేళ మాజీ ఎంపీ మార్గాని భరత్ నిజంగా రాజమండ్రిని అభివృద్ధి చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 70 వేల మెజారిటీ వచ్చేది కాదన్నారు. పెద్దలను గౌరవించడం నేర్చుకుంటే రాజకీయ ఉనికి ఉంటుందని మార్గాని భరత్‌కు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హితవు పలికారు. 

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల కోసం క్లిక్ చేయండి

మురళీమోహన్ హయాంలోనే ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనే మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ. 100 కోట్లు నిధులు ఇస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ హయాంలో రోజుకి 30 కిలోమీటర్ల హైవే రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మౌలిక సదుపాయాలు కావాలన్నారు.‌ 

ఏపీ సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Embed widget