అన్వేషించండి

PDS Rice Testing Kits: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీడీఎస్ బియ్యం క‌నిపెట్టేలా మొబైల్ టెస్టింగ్ కిట్స్‌

Andhra Pradesh News | ఏపీలో పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేయనున్నారు. రేష‌న్ బియ్యంలో క‌లిపే ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా పీడీఎస్ బియ్యం గుర్తించే మొబైల్‌ కిట్లును అందుబాటులోకి తెచ్చింది..

కాకినాడ: పీడీఎస్ బియ్యం మాఫియా అన‌గానే కాకినాడ పేరు ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది.. పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై అంత‌టిస్థాయి వివాదం కాకినాడ చుట్టూ ముసురుకుంది.. రాష్ట్ర‌వ్యాప్తంగా అక్ర‌మ ప‌ద్ద‌తిలో సేక‌రించిన పేద‌ల బియ్యాన్ని చివ‌ర‌కు కాకినాడ పోర్టు ద్వారా విదేశాల‌కు త‌ర‌లించి అక్ర‌మ సొమ్మును ఆర్జీస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎన్నిక‌ల‌కు ముందు నుంచి పెద్ద దుమార‌మే రేగింది.. ఈనేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేతగా ఉన్న నారా చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పీడీఎస్ బియ్యం మాఫియా అంతుచూస్తామ‌ని కూడా వాగ్ధానాలు చేశారు... కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వెంట‌నే ఆదిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు.. 

కూట‌మి ప్ర‌భుత్వంలోనూ మార‌ని తీరు...

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ ప‌ర్య‌ట‌కు వ‌చ్చి నేరుగా పోర్టుకు వెళ్లారు.. అక్క‌డ అక్ర‌మంగా ఎగుమ‌తి అవుతున్న పీడీఎస్ బియ్యం ను ట‌న్నుల కొద్దీ గుర్తించి సీజ్ చేయించారు.. ఆత‌రువాత ఏపీ సివిల్ స‌ప్లై మినిస్ట‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మ‌రో రెండు సార్లు కాకినాడ పోర్టులో విస్తృతంగా త‌నిఖీలుచేసి ట‌న్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం సీజ్ చేయించారు.. కానీ చాలా వ‌ర‌కు అవి పీడీఎస్ బియ్యం అని నిరూపించ‌లేని ప‌ర‌స్థితి తెలెత్తింది.. ఇదిలా ఉంటే కాకానాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల‌కు పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా ను అడ్డుకునేందుకు ప్ర‌త్యేక విధివిధానాలు రూపొందించిన‌ప్ప‌టికీ అవికూడా అనుకున్న 
స్థాయిలో ఫ‌లితాలు ఇవ్వ‌లేక‌పోయాయి.. కానీ య‌ధారాజా త‌థా ప్ర‌జా అన్న చందంగా పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా అనే నియంత్ర‌ణ కాలేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది..

తాజా నిర్ణయంతో పీడీఎస్ బియ్యం ఇట్టే క‌నిపెట్టే అవ‌కాశం..

గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో విచ్చ‌ల‌విడిగా జ‌రిగిన రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక కూడా నియంత్ర‌ణ కాలేని ప‌రిస్తితి క‌నిపిస్తోంది.. రేషన్ మాఫియాలో చాలా మంది పెద్దల హస్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి..ముఖ్యంగా  తీర ప్రాంతాల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతుంద‌ని, దీనికి అడ్డుక‌ట్ట వేయాలంటే చాలా ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని అధికారులు సైతం చేతులెత్తేసిన ప‌రిస్తితి క‌నిపించింది.. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇలాంటి రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు మంచి ప్రభుత్వం మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్ల‌య్యింది.. రేష‌న్ బియ్యం ప‌ట్టుకున్నా, అవి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న పీడీఎస్ బియ్యం అని అనుమానాలున్నా పీడీఎస్ బియ్యం అని రూడీ చేయ‌డానికి టెస్ట్ చేయడానికి ల్యాబ్ కి పంపి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. తాజాగా ప్ర‌భుత్వం ఒక మొబైల్ కిట్‌ను రూప‌క‌ల్ప‌న చేయించి పంపిణీకు సిద్ధం చేసింది. 

మొబైల్ కిట్ లో ఉండే కెమికల్ బాటిల్స్ రేషన్ బియ్యం లో వేసినప్పుడు పోషక విలువల కోసం రేషన్ బియ్యంలో కలుపుతున్న పోర్టిఫైడ్ రైస్ ఎరుపు రంగులోకి మారతాయి. వెంటనే అది అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అని అర్ధం క్లియ‌ర్‌క‌ట్‌గా అర్ధం అవుతుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 700 కిట్లు, 33 మంది అదనపు సిబ్బందిని విశాఖపట్నం లో 3 చెక్ పోస్ట్ ల దగ్గర నియమించారు. అలాగే కాకినాడ లో కూడా సుమారు 700 కిట్లు అద‌న‌పు సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది.. దీంతో పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాను చాలా సుల‌భంగా గుర్తించి క‌ట్ట‌డి చేయ‌డానికి వీలుంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. 

ఫోర్టిఫైడ్ బియ్యం ఎందుకంటే... 

పీడీఎస్ బియ్యంలో పోష‌క విలువ‌లు పెంచేవిధంగా ఫుడ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం క‌ల‌ప‌డం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ర‌క్త‌హీన‌త‌, పోష‌కాహార లోపం సమ‌స్యల‌ను త‌గ్గించేందుకు ఈ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. వీటివ‌ల్ల ఐర‌న్‌, ఫోలిక్ యాసిడ్‌, విట‌మిన్ బీ12 లాంటిముఖ్య‌మైన విట‌మిన్లు, ఖ‌నిజాలు ల‌భిస్తాయి.. ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్ర‌తీ క్వింటాల్ సాధార‌ణ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్ క‌ర్న‌ల్స్ క‌లుపుతున్నారు. 100 కిలోల బియ్యంలో అంటే ఒక శాతం వంతు ఫోర్టిఫైడ్ బియ్యం ఉంటుంది.. ఇప్ప‌డు పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా విష‌యంలో ప‌ట్టించేందుకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఉప‌యోగ ప‌డుతున్నాయి..  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget