అన్వేషించండి

పిల్లి సుభాష్ Vs చెల్లుబోయిన: వేణుకు టికెట్ ఇస్తే రాజీనామా చేసేస్తా, ఆయన చెప్పుకింద బతకట్లేదు - ఎంపీ పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదివారం (జూలై 23) చంద్రబోస్‌ మాట్లాడారు.

కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్ సీపీలో అంతర్గత విభేదాలు మరోస్థాయికి చేరాయి. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదివారం (జూలై 23) చంద్రబోస్‌ మాట్లాడారు. 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అవసరమైతే వైఎస్ఆర్ సీపీ నుంచి వైదొలిగి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, క్యాడర్‌ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి తాము సీఎం జగన్‌తోనే ఉన్నామని గుర్తు చేశారు. ఇద్దర్నీ పిలిచి సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారని అన్నారు. అసలు క్యారెక్టర్‌ లేని వ్యక్తితో తాను కూర్చోనని చెప్పేశానని పిల్లి సుభాష్‌ చంద్రబోస్ తెలిపారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు.

మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం..
రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణు వర్గం ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించింది. దీనికి మంత్రితోపాటు ఆయన కుమారుడు, మంత్రి ముఖ్య అనుచరులు అంతా హాజరయ్యారు. అయితే ఈసమావేశం పూర్తిగా తన బలప్రదర్శన చేసుకునే విధంగానే ఉండడంతో అటు ఇదే నియోజకవర్గంలో కీలక నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌పై తన అనుచరులనుంచి ఒత్తిడి తీవ్ర మైంది.. ఇప్పటికే వారం రోజుల క్రితం రామచంద్రపురంలో బోస్‌ అనుకూల వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రామచంద్రపురం వైసీపీ టిక్కెట్‌ బోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌కు ఇవ్వాలని, మంత్రి వేణు తమను అన్నివిధాలుగా రాజకీయంగా అణగద్రొక్కాలని ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి వద్దకు చేరిన పంచాయతీ..
రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా రచ్చకెక్కిన వైసీపీలో అంతర్యుద్ధం చివరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వద్దకు చేరింది. దీంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈసందర్భంగా రచ్చకెక్కిన విభేదాలు వల్ల పార్టీకు నష్టం వాటిల్లుతోందని, ఏమైనా ఉంటే ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడతానని జగన్‌ చెప్పినప్పటికీ రామచంద్రపురంలో వేణు పోటీచేయడం తనకు ఇష్టం లేదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రామచంద్రపురంలో ఇప్పుడు బోస్‌ వెల్లడించారు. అయితే ఈవిషయంలో ముఖ్యమంత్రి జగన్‌ బోస్‌పై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఎంపీ బోస్‌ మరోసారి రామచంద్రపురంలో మంత్రి వేణుకు టిక్కెట్టు ఇస్తే తాను కానీ, తన కుమారుడు కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని, పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బోస్‌ వెల్లడించారు.

తెలుగు దేశం వైపు చూపులు?
రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు బలమైన వర్గం ఉంది.. వేణుకు ఆస్థాయిలోనే వర్గం ఉన్నప్పటకీ స్థానికుడు కాదన్న విమర్శ ఉంది.. ముఖ్యమంత్రి జగన్‌ తనకు సంతృప్తికరమైన స్థానాన్ని ఇచ్చారని చెబుతూనే తనకు మంత్రి వేణు రామచంద్రపురంలో పోటీచేయడం ఇష్టం లేదని తేల్చిచెబుతున్నారు బోస్‌.. అయితే అధిష్టానం ఇప్పటికే రామచంద్రపురం నుంచి వేణు పోటీ చేస్తారని ఓ క్లారిటీ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రీమూర్తులు టీడీపీ ను వీడి వైసీపీలో చేరాక ఆయనకు మండపేట వైసీపీ బాద్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో కొత్తపేటకు చెందిన మాజీ శాసన మండలి వైస్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా టీడీపీ నియమించింది. అయితే బోస్‌ వంటి బలమైన నాయకుడు టీడీపీలోకి వస్తే వెంటనే ఆహ్వానించడమే కాకుండా పార్టీ టిక్కెట్టు కూడా ఇస్తామని హామీఇచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈనెల 26న రానున్న నేపథ్యంలో బోస్‌ను పిలిపించి మాట్లాడి రచ్చకెక్కిన రగడను సర్దుబాటు చేస్తారా.. ఈలోనే నిర్ణయం తీసుకుని బోస్‌ పార్టీకి రాజీనామా చేస్తారా అన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Konaseema News: పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget