అన్వేషించండి

దళితులకు స్వేచ్ఛ కల్పించండి- సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham: దళిత నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని ముద్రగడ సూచించారు. 

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి జగన్‌ కు లెటర్ రాశారు. ఈసారి దళితుల అంశంపై లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా దళిత వారి పదవులకు వాళ్లే ఓట్లు వేసుకునే విధానం తీసుకురావాలని జగన్‌కు పద్మనాభం సూచించారు. కొన్ని పదవుల్లోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అభ్యర్థించారు. 

అన్ని పదవులు కాకపోయినా పంచాయతీ స్థాయి ప్రెసిడెంట్‌, వార్డు మెంబర్లలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నారు. జనాభా 300 నుంచి పైబడిన దళితవాడలను గుర్తించి పంచాయతీలుగా మార్చినప్పుడు వారికి వచ్చిన గ్రాంట్లు అన్నీ వారి ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు.  

కొన్ని ప్రాంతాల్లో మిగతా సమాజిక వర్గాలతో కలిసి ఉన్న దళితులపై నిధులు ఖర్చు పెట్టడం వల్ల మిగిలిన వాళ్లు నష్టపోతున్నారని ముద్రగడ పద్మనాభం తెలిపారు. నాలుగు లేదా ఐదు దళిత కుటుంబాలు ఇతర సమాజిక వర్గాలతో కలిసి ఉండటం వల్ల దళితులకు సంబంధఇంచిన లక్షలాది రూపాయలు గ్రాంటు వాళ్లకే ఖర్చు చేయడం వల్ల మిగతా జనాభా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దళిత నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని ముద్రగడ సూచించారు. 

నాలుగు రోజుల క్రితం కూడా సీఎంకు ముద్రగడ ఓ లేఖ  రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ కు ఆ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్‌పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి  ఇచ్చిన సమాధానంపై దృష్టి పెట్టాలని లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారని.. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని సూచించారు.

ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో లేఖ రాయలేదని ముద్రగడ వివరణ 

మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని ముద్రగడ పద్మనాభం జగన్ ను కోరారు.  ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ప్రజలు దేవుళ్ళులా  భావించారు, పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించేందుకు పునాదులు వేసుకోవాలని సలహా ఇచ్చారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలన్నారు. తన ఈ లేఖల వల్ల జగన్ ఇబ్బంది పడతారని ముద్రగడ పద్మనాభం అనుకున్నారేమో కానీ చివరిలో వివరణ కూడా ఇచ్చారు. తన జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని లేఖలో వివరణ ఇచ్చారు. ఈ రెండు లేఖలు కూడా తన వ్యక్తిగతమన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget