అన్వేషించండి

High allert in Agency: రంపచోడవరం ఏజెన్సీలో హై అలర్ట్: ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరిక, కారణం ఇదే!

మారేడుమిల్లిలోని మావోయిస్టుల‌ భారీ ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో భార‌త్ బంద్ ప్ర‌క‌టించడంతో అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని  ఏజెన్సీ ప్రాంతం అయిన రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు పోలీసులు.

మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మా, అతని భార్య రాజేతో పాటు టెక్‌శంక‌ర్, ప‌లువురు మావోయిస్టుల‌ భారీ ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో భార‌త్ బంధ్ ప్ర‌క‌టించడంతో అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని  ఏజెన్సీ ప్రాంతం అయిన రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు పోలీసులు.. ఇటీవ‌లే మారేడుమిల్లి అటవీ ప్రాంతం జరిగిన రెండు భారీ ఎన్కౌంటర్ ల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు పోలీసులు.. 

ఏజెన్సీ ప్రాంతాల‌ను వ‌దలివెళ్లాల‌న్న పోలీసులు..

రంప‌చోడ‌వ‌రం కూట‌మి పార్టీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శిరీషా దేవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్సీగా అనంత‌బాబు,  ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి రంప‌చోడ‌వ‌రం ప‌రిధిలోనే ఉంటుండ‌డంతో దీంతో పోలీసులు వారిని అప్ర‌మ‌త్తం చేశారు. రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్ ప‌రిధిలోకి వ‌చ్చే మారేడుమిల్లిలో రెండు భారీ ఎన్ కౌంట‌ర్లుతో మావోయిస్టుల‌కు కోలుకోలేని దెబ్బ‌తగిలిన‌ట్ల‌య్యింది.. దీనికి తోడు పార్టీ అగ్ర‌నేత హిడ్మా మృతిచెంద‌డం మ‌రింత దెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది.. ఇది ముమ్మాటికీ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ అని ఓ లేఖ విడుద‌ల ఏసిన మావోయిస్టు పార్టీ ఆదివారం భార‌త్ బంద్ ప్ర‌క‌టించింది. 

మావోయిస్టుల ప్ర‌తీకార చ‌ర్య‌లు ఉండ‌వ‌చ్చ‌న్న అనుమానంతో పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్ర‌మ‌త్తం అయ్యింది... దీంట్లో భాగంగా రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌జాప్ర‌తినిధులుగా కీల‌క నేత‌లైన ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంత‌బాబు, ఎస్సీ క‌మిష‌న్ సోళ్ల బొజ్జిరెడ్డిని ఏజెన్సీ ప్రాంతాన్ని వీడివెళ్లాల‌ల‌ని సూచించారు. తాజా ప‌రిస్థితిని వారికి వివ‌రించారు. రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తోపాటు ఈప్రాంతాల్లో ఉండే కాంట్రాక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. 

రాత్రి నుంచే అటువైపుగా రాక‌పోక‌లు నిలిపివేత‌..

ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేతలు మాడవి హిడ్మా, మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందిన నేప‌ధ్యంలో మావోయిస్టులు నిర‌స‌న దినం పాటించాల‌న్న పిలుపుతో మారేడుమిల్లి మీదుగా భ‌ద్రాచ‌లం వెళ్లే బ‌స్సుల‌ను దారి మ‌ళ్లించారు. జగదల్ పూర్ వెళ్లే 30 నెంబర్ జాతీయ రహదారిపై శ‌నివారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. రాత్రివేళ ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రభుత్వ వాహనాలను, అధికారుల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు పోలీసులు.. చింతూరు భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులు కూనవరం మీదగా మళ్లీంచారు. 

త‌నిఖీలు ముమ్మ‌రం చేసిన పోలీసులు...

మావోయిస్టుల నిర‌స‌న దినం సంద‌ర్భంగా పోలీసులు త‌నిఖీల‌ను మ‌రింత ప‌టిష్టం నిర్వ‌హిస్తున్నారు.  మన్యం ప్రాంతంలో హైఅలెర్ట్ ఉంద‌న్న సంగ‌తి తెలియ‌ని ప‌ర్యాట‌కులు కార్తీక మాసం సంద‌ర్భంగా చాలా మంది త‌ర‌లివ‌స్తుండ‌గా వారిని వెన‌క్కు తిప్పి పంపిస్తున్నారు. మారేడుమిల్లి ఆవాస ప్రాంతాల‌ను దాటి ముందుకు వెళ్ల‌నీయ‌డంలేదు. అంతేకాకుండా ఇటువైపుగా వ‌స్తున్న వాహ‌నాల‌ను ఎక్క‌డిక్క‌డే త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.. మొత్తం మీద ప్ర‌శాంతంగా ఉండే మారేడుమిల్లిలో మాత్రం ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో హై అలెర్ట్ నెల‌కొంది.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Advertisement

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Embed widget