అన్వేషించండి

Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!

నరసాపురం- చెన్నై తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ విజ్ఞప్తితో న్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను నరసాపురం వరకూ పొడిగించారు.

Narasapur Vande Bharat: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. ఆమేరకు రైల్వే డిపార్ట్మెంట్ వివరాలు వెల్లడించింది.        

ఫలించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి       

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు ​శ్రీనివాస వర్మ గత కొన్ని నెలలుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చాలా సార్లు ఈ విషయమై భేటీ అయ్యారు. వాటి ఫలితం గా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి మంజూరు అయ్యాయి. దానివల్ల ఇప్పటివరకు చెన్నై (ఎంజీఆర్ చెన్నై సెంట్రల్) నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్లు: 20677/20678)ను నర్సాపురం-చెన్నై వందే భారత్ గా మార్చారు.        


Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!

నరసాపురం రైల్వే టైమింగ్స్ ఇవే           

ఈ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతోపాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నర్సాపురం వరకు పొడిగించిన వందే భారత్ ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ​రైలు నంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపురం వరకు, అలాగే రైలు నంబర్ 20678 నర్సాపురం నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది.            

చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( 20677 నెంబర్) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతూ విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.      

తిరుగు ప్రయాణంలో 20678 నెంబర్ రైలు నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని, 4:09 గంటలకు గుడివాడ చేరుకుని, 4:50 గంటలకు విజయవాడకు చెన్నైకు రాత్రి 23.45 గంటలకు చేరుకుంటుంది. అధికారిక ప్రారంభ తేదీని రైల్వే శాఖ అతిత్వరలో తెలియజేయనుంది.         

విజయవాడ స్టేషన్ లో ప్లాట్ ఫామ్ కొరతే అసలు కారణం        

ప్రస్తుతం చెన్నై- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ విజయవాడ మధ్యాహ్నం 12:10 కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 15:20 కి విజయవాడలో బయలుదేరి చెన్నై వెళుతోంది. అంటే 3 గంటలపైన ఈ రైలు కోసం విజయవాడలో ఒక ప్లాట్ ఫామ్ బ్లాక్ అయిపోతోంది. ఇప్పుడు ఈ ట్రైన్‌ను నరసాపురం వరకూ పొడిగించడం వల్ల విజయవాడ స్టేషన్‌లో ఆ ఇబ్బంది ఉండదు. రైల్వే శాఖ ఆలోచనకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రయత్నాలు తోడు కావడంతో నరసాపురాని తొలి వందే భారత్ వచ్చినట్టు అయింది. ఇది ఎప్పటి నుంచి అనేది అతి త్వరలోనే తెలియజేయనున్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advertisement

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Embed widget