అన్వేషించండి

Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!

నరసాపురం- చెన్నై తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ విజ్ఞప్తితో న్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను నరసాపురం వరకూ పొడిగించారు.

Narasapur Vande Bharat: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. ఆమేరకు రైల్వే డిపార్ట్మెంట్ వివరాలు వెల్లడించింది.        

ఫలించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి       

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు ​శ్రీనివాస వర్మ గత కొన్ని నెలలుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చాలా సార్లు ఈ విషయమై భేటీ అయ్యారు. వాటి ఫలితం గా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి మంజూరు అయ్యాయి. దానివల్ల ఇప్పటివరకు చెన్నై (ఎంజీఆర్ చెన్నై సెంట్రల్) నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్లు: 20677/20678)ను నర్సాపురం-చెన్నై వందే భారత్ గా మార్చారు.        


Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!

నరసాపురం రైల్వే టైమింగ్స్ ఇవే           

ఈ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతోపాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నర్సాపురం వరకు పొడిగించిన వందే భారత్ ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ​రైలు నంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపురం వరకు, అలాగే రైలు నంబర్ 20678 నర్సాపురం నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది.            

చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( 20677 నెంబర్) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతూ విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.      

తిరుగు ప్రయాణంలో 20678 నెంబర్ రైలు నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని, 4:09 గంటలకు గుడివాడ చేరుకుని, 4:50 గంటలకు విజయవాడకు చెన్నైకు రాత్రి 23.45 గంటలకు చేరుకుంటుంది. అధికారిక ప్రారంభ తేదీని రైల్వే శాఖ అతిత్వరలో తెలియజేయనుంది.         

విజయవాడ స్టేషన్ లో ప్లాట్ ఫామ్ కొరతే అసలు కారణం        

ప్రస్తుతం చెన్నై- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ విజయవాడ మధ్యాహ్నం 12:10 కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 15:20 కి విజయవాడలో బయలుదేరి చెన్నై వెళుతోంది. అంటే 3 గంటలపైన ఈ రైలు కోసం విజయవాడలో ఒక ప్లాట్ ఫామ్ బ్లాక్ అయిపోతోంది. ఇప్పుడు ఈ ట్రైన్‌ను నరసాపురం వరకూ పొడిగించడం వల్ల విజయవాడ స్టేషన్‌లో ఆ ఇబ్బంది ఉండదు. రైల్వే శాఖ ఆలోచనకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రయత్నాలు తోడు కావడంతో నరసాపురాని తొలి వందే భారత్ వచ్చినట్టు అయింది. ఇది ఎప్పటి నుంచి అనేది అతి త్వరలోనే తెలియజేయనున్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget