By: ABP Desam | Updated at : 21 Oct 2021 06:43 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నైరుతి రుతుపవనాల తిరోగమనంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 23వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 26న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తిరోగమన రేఖ.. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. ఈ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Mid-day forecast for Andhra Pradesh in telugu dated 20.10.2021 pic.twitter.com/vmsVRHWMXS
— MC Amaravati (@AmaravatiMc) October 20, 2021
రుతుపవనాల కాలం ముగిసినా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరులో ఢిల్లీలో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. రుతుపవనాలు ఆలస్యంగా విరమించడం, అనేక ప్రాంతాల్లో అల్పపీడనాలు ఏర్పడటం వల్లే అక్టోబరులో విపరీతమైన వర్షాలు కురిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఈ నెలలో నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడతాయి. ఈ కారణంగావర్షాలు తక్కువగా నమోదవుతాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో దేశంలోని తూర్పు ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. గత వారంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి.
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు
Kinjarapu Atchannaidu: చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు: అచ్చెన్నాయుడు
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల ర్యాలీకి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మద్దతు
TTD Electric Bus: తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు దొంగతనం - పక్కా ప్లాన్తో స్కెచ్
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్ప్రెస్లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్గా మారిన కేసు!
Asian Games: బంగ్లా 51కే ఆలౌట్ - ఆసియా టీ20 ఫైనల్కు స్మృతి మంధాన సేన
/body>