అన్వేషించండి

Rahul Zodo Yatra : వైఎస్ఆర్‌సీపీతో పొత్తుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు - క్లారిటీ వచ్చినట్లేనా ?

వైఎస్ఆర్‌సీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర ఆదోనికి చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు.


Rahul Zodo Yatra : రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయాల్సి ఉందని .. తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారత్ జోడోయాత్ర సాగుతోంది.ఈ సందర్భంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాం..ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.   పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా కూడా ఇచ్చిన హామీల్లో ఉంది. గతంలో జరిగిన విభజన కాకుండా..భవిష్యత్ పై దృష్టి పెట్టాలన్నారు.   

అమరావతికే మద్దతు !
 
ఏపీ రాజధానిపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు.   ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని తేల్చి చెప్పారు. మూాడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. మంగళవారం కూడా ఇదే అంశంపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. రాహుల్ ను కలిసేందుకు అమరావతి రైతులు కర్నూలు వచ్చారు. వారితో రాహుల్ సమావేశం అయ్యారు. అమరావతికే మద్దతని ప్రకటించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేస్తాం.. పోలవరం వల్ల వచ్చే ప్రయోజనాలను రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్ లా చూస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఏపీలో రైతులు, కార్మికుల హక్కులు కాపాడతామన్నారు. 

భారత్ జోడో  యాత్రకు మంచి స్పందన !

భారత్ జోడో యాత్ర దేశ సమగ్రతకు సంబంధించిందని రాహుల్ స్పష్టం చేశారు.  మా పార్టీ అందరిది. మేం దేశాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడదీయాలని చూడడం లేదన్నారు.  తన  దృష్టి అంతా భారత్ జోడో యాత్రపైనే ఉంది.. అందరినీ కలుస్తున్నాను.. వారి సమస్యలు వింటున్నాను.. భారత్ ఆర్థికవ్యవస్థను కాపాడాల్సి ఉందన్నారు.  దేశంలో రూపాయిని బలోపేతం చేయాలి. దేశంలో వన్ జీఎస్టీ-వన్ ట్యాక్స్ రావాల్సి ఉందన్నారు.  దేశంలో కుల రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శఇంచారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రె్స పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారని..  రాబోయే రోజుల్లో నేను ఎలాంటి పాత్ర పోషించాలనేది అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ తెలిపారు.  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు.  శశిథరూర్ చేసిన విమర్శలపై రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. 

వైఎస్ఆర్‌సీపీతో పొత్తుపై హైకమాండ్‌దే నిర్ణయం !

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అయితే  ఆ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  పొత్తుల విషయంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం మరే పార్టీలోనూ లేదు. ఈ యాత్ర రాజకీయాలకు సంబంధించి కాదని అన్నారు.  అలాగే కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏంటో అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అని జగన్ సొంత పార్టీ  పెట్టక ముదు చెప్పారు. అదే సమయంలో గతంలో ప్రశాంత్ కిషోర్.. ఏపీలో  వైఎస్ఆర్‌సీపీతో పొత్తు  పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Rahul Gandhi in Germany: జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Embed widget