అన్వేషించండి

Pawan Kalyan Donation: రైతుల కోసం పవన్ కళ్యాణ్ రూ.5 కోట్ల విరాళం - భీమ్లానాయక్ డబ్బులు అన్న జనసేనాని

Pawan Kalyan Donates Rs 5 Crore: భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Janasena Chief Pawan Kalyan Donates Rs 5 Crore For Farmers: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ కోశాధికారి ఏ.వి.రత్నంకు జనసేనాని పవన్ అందజేశారు.

వైఎస్ జగన్ వింత చట్టాలతో కౌలు రైతులకు కష్టాలు.. 
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతాంగం చితికిపోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌలు రైతులను రాష్ట్రంలో పట్టించుకునే నాథుడే లేడనీ, ఏపీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా అని అబద్ధాలు చెబుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక వింత చట్టాలు తీసుకొచ్చి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు దూరం చేశారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించి జనసేన పార్టీ ఆర్థిక సాయం చేయం చేయబోతుందని తెలిపారు.

జనసేన రైతు భరోసా యాత్ర.. (Janasena Rythu Bharosa Yatra)
ఈ నెల 12వ తేదీ అనంతపురం నుంచి రైతులకు ఆర్థిక సాయం చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు సాయం చేసే ఈ కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రాష్ట్రంలో 1019 మంది , రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోందనన్నారు.

తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు కర్నూలు జిల్లాలో 353 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా, అనంతరం జిల్లాలో 170 మంది, ప్రకాశంలో 49 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 87 మంది బలవన్మరణం చెందారని తెలిపారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన ముద్దుపెట్టిన జగన్ ఇప్పుడు బయటకు రావడం లేదని.. మాట తప్పారని, మడమ తిప్పారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు.

మళ్లీ పాదయాత్ర చేస్తే సెగ తప్పదు..
రాష్ట్రంలోని రైతులు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే వెళ్లిన ప్రతిచోట రైతులు నిరసన తెలుపుతారు. వారు ఎంతో కష్టపడి పంట పండిస్తే ఏపీ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై బస్తా రూ.700కు కొని, రూ.1400కు అమ్ముకుంటుందని జనసేన పార్టీ ఆరోపించింది. నివార్ తుఫాను వచ్చి రైతులు నష్టపోతే జనసేన పార్టీ తరఫున ఏకరానికి కనీసం రూ.25 వేల సాయం అందించాలని ధర్నా చేశామని, కానీ సీఎం జగన్ ఏమాత్రం స్పందించలేదన్నారు. 17 లక్షల మంది కౌలు రైతుల్లో 5 లక్షల మందికి కార్డులు అందించే ప్రయత్నాలు చేశారు. ప్రతి గ్రామంలో నష్టపోయిన రైతులు ఉన్నారని, పార్టీ నాయకులు వారి పక్షాన బలంగా నిలబడాలని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Also Read: Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ 

Also Read: CM Jagan meets Union Ministers: గత ప్రభుత్వం హయంలో అలా చేసి ఇప్పుడెందుకు కోతలు- సరి చేయాలని కేంద్రమంత్రులకు సీఎం జగన్ విజ్ఞప్తి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget