అన్వేషించండి

Pawan Kalyan Donation: రైతుల కోసం పవన్ కళ్యాణ్ రూ.5 కోట్ల విరాళం - భీమ్లానాయక్ డబ్బులు అన్న జనసేనాని

Pawan Kalyan Donates Rs 5 Crore: భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Janasena Chief Pawan Kalyan Donates Rs 5 Crore For Farmers: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ కోశాధికారి ఏ.వి.రత్నంకు జనసేనాని పవన్ అందజేశారు.

వైఎస్ జగన్ వింత చట్టాలతో కౌలు రైతులకు కష్టాలు.. 
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతాంగం చితికిపోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌలు రైతులను రాష్ట్రంలో పట్టించుకునే నాథుడే లేడనీ, ఏపీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా అని అబద్ధాలు చెబుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక వింత చట్టాలు తీసుకొచ్చి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు దూరం చేశారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించి జనసేన పార్టీ ఆర్థిక సాయం చేయం చేయబోతుందని తెలిపారు.

జనసేన రైతు భరోసా యాత్ర.. (Janasena Rythu Bharosa Yatra)
ఈ నెల 12వ తేదీ అనంతపురం నుంచి రైతులకు ఆర్థిక సాయం చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు సాయం చేసే ఈ కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రాష్ట్రంలో 1019 మంది , రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోందనన్నారు.

తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు కర్నూలు జిల్లాలో 353 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా, అనంతరం జిల్లాలో 170 మంది, ప్రకాశంలో 49 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 87 మంది బలవన్మరణం చెందారని తెలిపారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన ముద్దుపెట్టిన జగన్ ఇప్పుడు బయటకు రావడం లేదని.. మాట తప్పారని, మడమ తిప్పారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు.

మళ్లీ పాదయాత్ర చేస్తే సెగ తప్పదు..
రాష్ట్రంలోని రైతులు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే వెళ్లిన ప్రతిచోట రైతులు నిరసన తెలుపుతారు. వారు ఎంతో కష్టపడి పంట పండిస్తే ఏపీ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై బస్తా రూ.700కు కొని, రూ.1400కు అమ్ముకుంటుందని జనసేన పార్టీ ఆరోపించింది. నివార్ తుఫాను వచ్చి రైతులు నష్టపోతే జనసేన పార్టీ తరఫున ఏకరానికి కనీసం రూ.25 వేల సాయం అందించాలని ధర్నా చేశామని, కానీ సీఎం జగన్ ఏమాత్రం స్పందించలేదన్నారు. 17 లక్షల మంది కౌలు రైతుల్లో 5 లక్షల మందికి కార్డులు అందించే ప్రయత్నాలు చేశారు. ప్రతి గ్రామంలో నష్టపోయిన రైతులు ఉన్నారని, పార్టీ నాయకులు వారి పక్షాన బలంగా నిలబడాలని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Also Read: Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ 

Also Read: CM Jagan meets Union Ministers: గత ప్రభుత్వం హయంలో అలా చేసి ఇప్పుడెందుకు కోతలు- సరి చేయాలని కేంద్రమంత్రులకు సీఎం జగన్ విజ్ఞప్తి

టాప్ హెడ్ లైన్స్

ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
Sai Krishna Murder Case: లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
Breaking News: రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
హైవేపై రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Embed widget