అన్వేషించండి

Pawan Kalyan Donation: రైతుల కోసం పవన్ కళ్యాణ్ రూ.5 కోట్ల విరాళం - భీమ్లానాయక్ డబ్బులు అన్న జనసేనాని

Pawan Kalyan Donates Rs 5 Crore: భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Janasena Chief Pawan Kalyan Donates Rs 5 Crore For Farmers: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ కోశాధికారి ఏ.వి.రత్నంకు జనసేనాని పవన్ అందజేశారు.

వైఎస్ జగన్ వింత చట్టాలతో కౌలు రైతులకు కష్టాలు.. 
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతాంగం చితికిపోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌలు రైతులను రాష్ట్రంలో పట్టించుకునే నాథుడే లేడనీ, ఏపీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా అని అబద్ధాలు చెబుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక వింత చట్టాలు తీసుకొచ్చి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు దూరం చేశారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించి జనసేన పార్టీ ఆర్థిక సాయం చేయం చేయబోతుందని తెలిపారు.

జనసేన రైతు భరోసా యాత్ర.. (Janasena Rythu Bharosa Yatra)
ఈ నెల 12వ తేదీ అనంతపురం నుంచి రైతులకు ఆర్థిక సాయం చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు సాయం చేసే ఈ కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రాష్ట్రంలో 1019 మంది , రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోందనన్నారు.

తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు కర్నూలు జిల్లాలో 353 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా, అనంతరం జిల్లాలో 170 మంది, ప్రకాశంలో 49 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 87 మంది బలవన్మరణం చెందారని తెలిపారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన ముద్దుపెట్టిన జగన్ ఇప్పుడు బయటకు రావడం లేదని.. మాట తప్పారని, మడమ తిప్పారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు.

మళ్లీ పాదయాత్ర చేస్తే సెగ తప్పదు..
రాష్ట్రంలోని రైతులు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే వెళ్లిన ప్రతిచోట రైతులు నిరసన తెలుపుతారు. వారు ఎంతో కష్టపడి పంట పండిస్తే ఏపీ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై బస్తా రూ.700కు కొని, రూ.1400కు అమ్ముకుంటుందని జనసేన పార్టీ ఆరోపించింది. నివార్ తుఫాను వచ్చి రైతులు నష్టపోతే జనసేన పార్టీ తరఫున ఏకరానికి కనీసం రూ.25 వేల సాయం అందించాలని ధర్నా చేశామని, కానీ సీఎం జగన్ ఏమాత్రం స్పందించలేదన్నారు. 17 లక్షల మంది కౌలు రైతుల్లో 5 లక్షల మందికి కార్డులు అందించే ప్రయత్నాలు చేశారు. ప్రతి గ్రామంలో నష్టపోయిన రైతులు ఉన్నారని, పార్టీ నాయకులు వారి పక్షాన బలంగా నిలబడాలని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Also Read: Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ 

Also Read: CM Jagan meets Union Ministers: గత ప్రభుత్వం హయంలో అలా చేసి ఇప్పుడెందుకు కోతలు- సరి చేయాలని కేంద్రమంత్రులకు సీఎం జగన్ విజ్ఞప్తి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget