అన్వేషించండి

Pawan Kalyan: తూర్పు కాపుల లెక్కలు తేలుస్తాం, వారి సమస్యలను జనసేన ప్రభుత్వంలో పరిష్కరిస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు కాపుల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

Pawan Kalyan: జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు కాపుల జనాభాపై వైసీపీ వింత లెక్కలు తేలుస్తామని ఆ పార్టీ అధనేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కాల్ల మండలం పెద్ద అమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాలులో తూర్పు కాపు రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకాగా... పలువురు తూర్పు కాపు నాయకులు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సంద్భంగా జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ... పశ్చిమ గోదావరి జిల్లా భీమరవరం తనకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చిందని చెప్పారు. అలాగే తూర్పు కాపుల సంక్షేమానికి ఇక్కడే బీజం పడిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను తెలుకునే కార్యక్రమమే జనవాణి అని చెప్పుకొచ్చారు. తూర్పు కాపుల సమస్యలను విన్నామని, వారి బాధలు, సమస్యలను దగ్గరి నుంచి చూశానని అన్నారు. 

మొత్తం 46 లక్షల జనాభా.. టీడీపీ 26 లక్షలంటే, వైసీపీ 16 లక్షలని లెక్కలు

ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు దాటితే తూర్పు కాపులకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇవ్వరని..కేవలం ఆ మూడు జిల్లాల్లోనే వారికి బీసీ కార్డు పనికొస్తుందని అన్నారు. తెలంగాణకు వెళ్తే అసలు వారిని బీసీలుగానే గుర్తించరని చెప్పారు. వంశధార నిర్వాసితుల్లో ఎక్కువ మంది తూర్పు కాపులే ఉన్నారని.. వాళఅలే ఎక్కువగా వలసలు వెళ్తున్నారని వివరించారు. తూర్పు కాపులు మొత్తం 46 లక్షల మంది ఉన్నారని కుల సంఘాల నాయకులు చెబుతున్నారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో వారిని 26 లక్షలుగా గుర్తిస్తే.. వైసీపీ వారిని కేవలం 16 లక్షలే అని లెక్కలు చెబుతోందని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక తూర్పు కాపుల లెక్కలు తేలుస్తామని.. అలాగే వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.   

రూ.300 కోట్ల ఆస్తి కాపాడుకునేందుకు ప్రజల ఆస్తులు వదిలేశారు..!

ప్రతీసారి పవన్ కల్యాణ్ ఆవేశంతో మాట్లాడతాడు, ఉక్రోషంతో ఊగిపోతాడని కామెంట్లు చేస్తారని.. కానీ దాని వెనుక పేదోడి ఆవేదన దాగి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని.. వారికి అన్యాయం జరిగితే తనకు జరిగినట్లే అనుకుంటానని.. చెప్పారు. ప్రజలు వారి సమస్యల గురించి చెబితే.. తన కుటుంబ సభ్యుల సమస్యలు విన్నట్లు అనిపించి, తన రక్తం మరిగిపోతుందని వివరించారు. జగన్ రెడ్డి తెలంగాణలోని తన రూ.300 కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి.. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను మొత్తం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక, తెలంగాణకు వదిలేసి వచ్చేశాడని ఆరోపించారు. విభజన సమయంలో ఏపీకి చెందాల్సిన వేల కోట్ల ఆస్తులు అవంటూ కామెంట్లు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 23 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిందని... దాని గురించి మాట్లాడని వైసీపీ పాలకులు తమ ఆస్తులు కాపాడుకునేందుకు ప్రజల ఆస్తులను వదిలేశారన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget