Pawan Kalyan : వడ్డీ వ్యాపారుల్లా పన్నులు వసూలు చేస్తారా ? ఏపీ సర్కార్ పై పవన్ ఆగ్రహం !
ఏపీ ప్రభుత్వ పన్నుల వసూలు తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజల పరువు తీస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఆస్తిపన్ను , నల్లా పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామంటూ కాకినాడలో వాహనాలకు బ్యానర్లు కట్టి మరీ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఫోటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రోజువారీ వడ్డీ వ్యాపారుల్లా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందని మండిపడ్డారు.
ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది. pic.twitter.com/MIuGWaJeyN
— Pawan Kalyan (@PawanKalyan) March 18, 2022
అలాగే కర్నూలు చెత్తపన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్త పోసిన అంశంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. చెత్త పన్ను విధింపే ఓ దరిద్రం అనుకుంటే దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందన్నారు. ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకొంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు- సిటీలోని చెత్తను తెచ్చి వేసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. pic.twitter.com/e1jwnlRSm1
— Pawan Kalyan (@PawanKalyan) March 18, 2022
ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల వసూలు విషయంలో చాలా దూకుడైన పద్దతులు పాటిస్తోంది. ఈ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే చెత్త పన్ను విషయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. చెత్త పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోస్తామని .. పోయాలని అధికారులు.. ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నారు. వీటిని హెచ్చరికలతోనే సరి పెట్టడం లేదు. నిజంగానే పోస్తున్నారు. శ్రీకాకుళంలో.. కర్నూలులోనూ అలాగే చేశారు. దీనిపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్తకొత్త పన్నుల భారం ప్రజలపై ఏపీ ప్రభుత్వం మోపుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets