Devineni Uma Arrest: మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్, మైలవరం మార్కెట్ యార్డ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
Devineni Uma Arrest: వర్షంలో తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనాలని నేషనల్ హైవే పై రాస్తారోకో చేస్తున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Devineni Uma Arrest: మైలవరం మార్కెట్ యాడ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్షంలో తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనాలని నేషనల్ హైవే పై రాస్తారోకో చేస్తున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తడిసిన ధాన్యం, మొక్కజొన్న వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రైతులతో కలిసి జాతీయ రహదారి (మైలవరం - చత్తీస్ గడ్) మొక్కజొన్న ధాన్యం పారబోసి కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దేవినేని ఉమాను అదుపులోకి తీసుకోవడంతో, టీడీపీ కార్యకర్తలు నిలువరించే ప్రయత్నం చేశారు. ధర్నా చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్రిక్తత నడుమ అరెస్ట్ చేసిన పోలీసులు మైలవరం స్టేషన్ కు తరలించారు.
రైతుల పక్షాన నిలిచానన్న కారణంగా తనను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కోరగా ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను ఇక్కడికి పంపి తనను అరెస్ట్ చేయించిందన్నారు. రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయొద్దని, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ అక్కడ నినాదాలతో మార్మోగిపోయింది. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల పక్షాన టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
పోలీసులు దేవినేని ఉమను బలవంతంగా జీపులోకి ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీస్ జీపులో దేవినేని ఉమను తీసుకెళ్తుంటే కొందరు వాహనానికి అడ్డంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అయితే నిరసనకారులను పక్కను జరిపి దేవినేని ఉమను పోలీసులు మైలవరం పీఎస్ కు తరలించినట్లు తెలుస్తోంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు ఇదివరకే లేఖ రాశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets