అన్వేషించండి

Nara Lokesh: 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు టీడీపీ నోటీసులు - నారా లోకేష్ సంచలన నిర్ణయం

TDP: పదే పదే చెబుతున్నా గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇవ్వాలని నారా లోకేష్ నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు.

Nara Lokesh Warning to 23 MLAs and two ministers: తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ,  మంత్రి నారా లోకేశ్ జోనల్ కో-ఆర్డినేటర్లతో మంగళవారం మంగళగిరిలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశం నిర్వహించారు. పార్టీపై నిర్లక్ష్యం, కార్యకర్తలను పట్టించుకోని నేతలపై  ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్, గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు ఫార్మల్ నోటీసులు జారీ చేయాలని జోనల్ ఇన్‌చార్జ్‌లకు ఆదేశించారు.

మంత్రులు, ఎమ్మెల్యేల్లో నిర్లక్ష్యం వద్దని నారా లోకేష్ స్పష్టం చేశారు.  పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ న్యాయం చేయడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.  డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో, 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని, అంతకు ముందు అన్ని పెండింగ్ పోస్టులు  భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.   

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నాయకులు కార్యకర్తలను,  ప్రజలను విస్మరిస్తున్నారని లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ డేస్ నిర్వహించకపోవడం, ప్రజా దర్బార్‌లు ఏర్పాటు చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంమన్నారు. ఇలాంటి 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు గుర్తించామని.. వారికి జోనల్ కో-ఆర్డినేటర్లు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ఇది  ముందస్తు హెచ్చరిక అని స్పష్టం చేశారు.  పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది మంగళగిరి ప్రజా దర్బార్‌కు రావడం ఎందుకని ప్రశ్నించిన లోకేశ్, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో వారాంతాపు గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించాలని, మంత్రులు కూడా  టీడీపీ కార్యాలయం గ్రీవెన్స్ సెషన్లలో పాల్గొనాలని సూచించారు.

పార్టీ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కార్యకర్తలను మరచిపోకూడదన్నారు.  వారికి ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడం మా బాధ్యత. ఈ బాధ్యతను తానే తీసుకుంటానన్నారు.  అని చెప్పుకొచ్చారు. జోనల్ కో-ఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారథి కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని, పెన్షన్ పంపిణీ స్వచ్ఛ అంధ్రా కార్యక్రమాలు, క్యాడర్ రివ్యూలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలపై వివరణాత్మక రిపోర్టులు సమర్పించాలని,  నాయకత్వం రివ్యూ చేస్తుందని తెలిపారు.  

ప్రజల సమస్యలు నియోజకవర్గ స్థాయిలోనే పరిష్కారం కావాలని నారా లోకేష్ భావిస్తున్నారు. అయితే  చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. దాని వల్ల వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నప్పుడు వస్తున్నారు.                                                                    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Embed widget