అన్వేషించండి

Nellore News: జగన్‌ సమీక్షకు ముందుకు స్వరం మార్చిన ఆనం, అలా అయితే ఓకే అంటూ ప్రకటన

వెంకటగిరిలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపకపోయినా కనీసం వెంకటగిరి కేంద్రంగా ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఆనం రామనారాయణ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు.

ఆమధ్య వెంకటగిరిలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాల్సిందేనంటూ డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లాలో కలపకపోయినా కనీసం వెంకటగిరి కేంద్రంగా ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి కొత్త ప్రతిపాదన ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి. 


Nellore News: జగన్‌ సమీక్షకు ముందుకు స్వరం మార్చిన ఆనం, అలా అయితే ఓకే అంటూ ప్రకటన

ఎందుకీ వెనకడుగు..? 
ఆమధ్య ఆనం రామనారాయణ రెడ్డి మూడు మండలాల విషయంలో తీవ్రంగా పట్టుబట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది. పునర్విభజన తర్వాత.. తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలోకి  వెంకటగిరి వెళ్లిపోతుంది. దీంతో ఆనం అభ్యంతరం తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనేది ఆయన ప్రతిపాదన. ఆమేరకు జిల్లాల పునర్విభజనపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అసంబద్ధంగా విభజన ప్రక్రియ జరిగిందని అన్నారు. ఓ దశలో మూడు మండలాల ప్రజలతో కలసి ఆయన నిరాహార దీక్షల్లో కూడా పాల్గొన్నారు. 

మారిన సమీకరణాలు.. 
ఆనం ఊపు చూస్తే.. ఏదో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారేమోనని అనిపించింది. కానీ ఇప్పుడా వేడి చల్లారినట్టుంది. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపే వరకు ఊరుకునేది లేదని తెగేసి చెప్పిన ఆనం రామనారాయణ రెడ్డి.. ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గారు. మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. జిల్లాల పునర్విభజపై అభ్యంతరాల స్వీకరణకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటం.. నెల్లూరు జిల్లా అభ్యంతరాలపై విజయవాడలో బుధవారం కీలక సమీక్ష జరగబోతుండటంతో ఆనం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని కలిసి కొత్త ప్రతిపాదన ఆయన ముందుంచారు. కొత్తగా ఏర్పడే బాలాజీ జిల్లాలో వెంకటగిరి కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా చేస్తే వెంకటగిరి ప్రాంతాలకు పరిపాలనా పరమైన సౌలభ్యం.. ఉంటుందని చెప్పారు. 

వెంకటగిరి మున్సిపాల్టీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల ప్రజల, ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలను ఆయన జిల్లా కలెక్టర్ కి అందించారు. రెవెన్యూ డివిజన్ కు సానుకూలంగా స్పందించాలని కోరారు. జిల్లాల పునర్విభజన సమీక్షలో ఈ విషయాలను ప్రస్తావించాలన్నారు. 

గతంలో జిల్లా విభజనతో సాగునీటి సమస్యలొస్తాయని ప్రస్తావించారు ఆనం రామనారాయణ రెడ్డి. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల విషయంలో నీటి తగాదాలు జరుగుతాయని, రైతులు తగాదా పడతారని, తీవ్ర పరిణామాలుంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఇబ్బందులన్నీ సమసిపోతాయంటున్నారు ఆనం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget