అన్వేషించండి

Well Done AP: శభాష్ ఏపీ, మిగతా రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి: కేంద్ర మంత్రి ప్రశంసలు

ఏపీ వ్యవసాయ శాఖకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కితాబిచ్చారు. ఏపీలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని ఆయన ప్రశంసించారు. ఆ విషయంలో ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.

Narendra singh Tomar Praises AP Govt schemes: ఏపీ వ్యవసాయ శాఖకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కితాబిచ్చారు. ఏపీలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆ విషయంలో ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల పనితీరుని ఆయన ప్రశంసించారు. ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు మంత్రి తోమర్. ఆర్బీకేలతోపాటు.. ఏపీలో అమలు చేస్తున్న ఈ క్రాపింగ్, ప్రకృతి సేద్యాన్ని కూడా ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బెంగళూరులో జరిగిన వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రుల సదస్సులో పాల్గొన్న ఆయన.. ఏపీని ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తరఫున హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఆయన ప్రశంసించారు. 

బెంగళూరులో రెండురోజులపాటు వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రుల జాతీయసదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ తరపున వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇంచార్జ్‌ కమిషనర్‌ డాక్టర్‌ గడ్డం శేఖర్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రసంగించిన కాకాణి గోవర్దన్ రెడ్డి, రైతులకోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. రైతుభరోసా - పీఎం కిసాన్‌ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.13,500 జమచేస్తోందని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. కేంద్రం అందిస్తున్న 6 వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోందని వివరించారు. ఒకేసారి కాకుండా విడతలవారీగా రైతులకు అవసరమైన సమయంలో రైతు భరోసా సొమ్ము జమ చేస్తున్నామని చెప్పారు.


Well Done AP: శభాష్ ఏపీ, మిగతా రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి: కేంద్ర మంత్రి ప్రశంసలు

సీజన్‌కు ముందే రైతు భరోసా నగదు సాయం.. 
ఖరీఫ్‌ సీజన్‌ కు ముందు మే నెలలో, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌ నెలలో రైతు భరోసా సొమ్ము అందిస్తున్నట్టు మంత్రి కాకాణి తెలిపారు. ఇక కేంద్రం ఇస్తున్న 6 వేలను మూడు విడతల్లో కాకుండా రెండు విడతల్లోనే ఇవ్వాలని సూచించారు కాకాణి. రైతు భరోసా మాదిరిగానే మే నెలలో రూ.3 వేలు, అక్టోబర్‌లో రూ.3 వేలు సర్దుబాటు చేస్తే రైతులకు మరింత ఉపయోగం కలుగుతుందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు ఏపీ మంత్రి కాకాణి వివరించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ వరకు తప్పనిసరిగా ఈ ప్రతిపాదన పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను కూడా రైతులందరికీ వర్తింపజేస్తామని కూడా నరేంద్ర సింగ్ తోమర్ హామీ ఇచ్చారు. 

ప్రకృతి సేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి 
కేంద్రం చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన కొత్త పథకాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ కూడా సదస్సులో వివరించారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రకృతిసేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు మంత్రి. ఇప్పటికే ఏపీలో ఈ తరహా ప్రకృతిసేద్యాన్ని పెద్దఎత్తున స్థానిక ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. లక్షలాదిమంది రైతులు ఇప్పటికే ప్రకృతిసేద్యం వైపు వెళ్లారని తెలిపారు. ఈ విషయంలో ఏపీని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వ్యవసాయ విధానాల్లో మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. 
Also Read: Rains in AP Telangana: ఏపీలో నేడు ఓ మోస్తరు వర్షాలు - జూలై 20 వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్: IMD

ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగు ఉత్పాదకాలను నేరుగా రైతుల ముంగిటకు తీసుకువెళ్లడం అభినందనీయం అన్నారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలతోపాటు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారని అభినందించారు ఈ–క్రాప్‌ను ప్రామాణికంగా తీసుకుని వాస్తవ సాగుదారులకు ఏపీలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధానం ఆదర్శనీయంగా ఉందని చెప్పారు కేంద్ర మంత్రి తోమర్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget