అన్వేషించండి

అదృశ్యమైన హాస్టల్ అమ్మాయిల ఆచూకీ ఎలా దొరికిందంటే ?

వెంకటగిరిలో అమ్మాయిలు ఉన్నట్టు గుర్తించారు. వెంకటగిరి బస్టాండ్ లోని సీసీ కెమెరాల్లో ఆ ముగ్గురు అమ్మాయిల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు ఆ చుట్టుపక్కల గాలించడం మొదలు పెట్టారు.

నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలోని ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సెలవుల నుంచి పాఠశాలకు వచ్చిన ఆ ముగ్గురు బాలికలు.. ఇంటిపై బెంగతో హాస్టల్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికే చీకటి పడటం, ఇంటికి తిరిగి వెళ్తే తల్లిదండ్రులు మందలిస్తారన్న కారణంతో వారు వెంకటగిరిలో ఉండిపోయారు. ఆ ముగ్గురు 10వతరగతి చదువుతున్నారు. అయితే రాత్రికి పిల్లలు హాస్టల్ కి రాలేదని గ్రహించిన తల్లిదండ్రలు, హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో ఆ పిల్లలను ట్రేస్ చేశారు. ఆ ముగ్గురు వెంకటగిరిలోని టీచర్స్ కాలనీలో ఉన్నట్టు గుర్తించారు. వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 

రాపూరు హాస్టల్ లో టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్ అనే వార్త బయటకు రాగానే మిగతా పిల్లల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. అసలు హాస్టల్ లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎందుకు బయటకు వెళ్లిపోయారు, హాస్టల్ లో ఏం జరుగుతోందంటూ ఆరా తీశారు. చివరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ సిబ్బంది కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రాపూరు పోలీసులు, వెంకటగిరి పోలీసుల సహకారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 

వెంకటగిరిలో అమ్మాయిలు ఉన్నట్టు గుర్తించారు. వెంకటగిరి బస్టాండ్ లోని సీసీ కెమెరాల్లో ఆ ముగ్గురు అమ్మాయిల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు ఆ చుట్టుపక్కల గాలించడం మొదలు పెట్టారు. వాస్తవానికి ముగ్గురు అమ్మాయిలు సంక్రాంతి సెలవల తర్వాత అదేరోజు హాస్టల్ కి వచ్చారు. తల్లిదండ్రులతో కలసి వారు హాస్టల్ కి వచ్చారు. అయితే హోమ్ సిక్ తో వారికి హాస్టల్ లో ఉండటం ఇష్టం లేదు. వెంటనే ఇంటికి వెళ్లాలనుకున్నారు. హాస్టల్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశారు. అయితే ఇంటికి వెళ్దామనుకునే క్రమంలో వారు కొంతసేపు వెంకటగిరిలోనే ఉండిపోయారు. ఓవైపు చీకటిపడిపోతుండే సరికి వారికి ఇంటికి వెళ్లేందుకు ధైర్యం సరిపోలేదు. రాత్రివేళ ఇంటికి వస్తే తల్లిదండ్రులు మందలిస్తారేమోననే భయంతో వారు వెంకటగిరిలోనే ఉండిపోయారు. టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఉన్న వారిని పోలీసులు ట్రేస్ చేశారు. 

అమ్మాయిలు మిస్సింగ్ అనే వార్త బయటకు రావడం, గతంలో కూడా అదే హాస్టల్ నుంచి అమ్మాయిలు వెళ్లిపోయారని తేలడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే మూడు టీముల్ని రంగంలోకి దింపారు. మరోవైపు అమ్మాయిల ఆచూకీ దొరికినా, వారు మైనర్లు కావడంతో వారి వివరాలు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది. దీంతో వారు రహస్యంగా ఈ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అమ్మాయిలు దొరకగానే ముందు పోలీస్ స్టేషన్ కి తరలించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, పిల్లలు క్షణికావేశంలో అఘాయిత్యం చేసుకోకుండా చూడాలన్నారు. వారికి చదువు విలువ తెలియజెప్పి ఇంటికి పంపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget