అన్వేషించండి

New District Politics In Nellore: ఆనం స్టార్ట్ చేస్తే ఆదాల కొనసాగిస్తున్నారు, నెల్లూరు వైసీపీకి కొత్త తలనొప్పి

ఏపీలో కొత్త జిల్లాల రాజకీయం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. అధికార పార్టీ నుంచే నేతలు కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపక్షం నుంచే కాకుండా అధికార పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఇది మరింత ఎక్కువగా ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ ఇటీవల ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఏకంగా నిరాహార దీక్షలకు సైతం దిగారు. నిరసనకారులతో కలసి ఆయన కూడా పోరాటాల్లో పాల్గొంటున్నారు. అటు చిత్తూరు జిల్లాలోనే నగరి నియోజకవర్గాన్ని కొనసాగించాలంటూ మరో ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ కి లేఖ రాయడంతోపాటు, పర్సనల్ అపాయింట్ మెంట్ కూడా అడిగారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కొనసాగించాలంటున్నారు. నెల్లూరులో అదనంగా చేరుస్తున్న కందుకూరుని ప్రకాశంలోనే ఉండనీయాలంటున్నారు. 

ఆదాల ప్రధాన డిమాండ్ ఏంటి..?
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై పట్టుబట్టడం విశేషం. నెల్లూరు జిల్లాలో మమేకమై అభివృద్ధి చెందిన గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారు ఆదాల. ముఖ్యమంత్రి  జగన్ కి , నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి ఆయన లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెబుతూనే.. ఆ రెండు నియోజకవర్గాల విషయంలో మెలిక పెట్టారు ఆదాల. 

చిన్న జిల్లాల విభజన వల్ల సత్వర ప్రగతి సాధ్యమవుతుందని అంటున్న ఆదాల, కందుకూరు నియోజకవర్గ ప్రజలు పని మీద నెల్లూరుకు రావాలంటే 110 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుందని, అదే ఒంగోలు వారికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి అందుబాటులో ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జిల్లా కేంద్రం తిరుపతికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కందుకూరును ప్రకాశంలో, గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంత లేటెందుకు..?
జిల్లాల విభజనపై నోటిఫికేషన్ విడుదల కావడం, అభ్యంతరాలు తెలపాలని చెప్పడం జరిగి రోజులు గడుస్తున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి కాస్త ఆలస్యంగా స్పందించారు అనుకుంటే, ఆదాల మరింత ఆలస్యంగా తన విజ్ఞప్తిని జనంలోకి తెస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలనుంచే పాలన సాగాలని కూడా సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన కసరత్తులన్నీ పూర్తవుతున్నాయి. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలకు కూడా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. కొత్త బిల్డింగ్ ల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దాదాపుగా అభ్యంతరాలన్నిటినీ.. కలెక్టర్లే వడపోస్తారని, ఆపై ప్రభుత్వానికి చేరుస్తారని సమాచారం. అంటే కలెక్టర్ల వద్దే అభ్యంతరాలన్నీ వీగిపోతాయనమాట. ప్రభుత్వం సుముఖంగా ఉన్నవాటినే ఉన్నతాధికారుల కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. అయితే ఇలా బహిరంగ లేఖలు, ప్రదర్శనల ద్వారా ఫలితం ఉండదని అంటున్నారు. సీఎం జగన్ సుముఖంగా ఉంటే అంతా చర్చలతోనే పరిష్కారం అవుతుంది. ఆయన అంగీకారం లేకపోతేనే.. ప్రజల కంటితుడుపుగా ఇలా నాయకులు లేఖలతో సరిపెడుతుంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget