అన్వేషించండి

Nellore Crime : తండ్రి ప్రేమ దూరమవుతుందని తల్లిని హత్య చేసిన కొడుకులు

Nellore Crime : తండ్రి ప్రేమ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో వారిద్దరూ సవతి తల్లిని కిరాతకంగా హతమార్చారు. వారిద్దరినీ నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకరి వయసు 19 ఏళ్లు, మరొకరి వయసు 21 ఏళ్లు. పెద్దగా ప్రపంచం తెలియని వయసు. భావోద్వేగాలకు, చెప్పుడు మాటలకు సులభంగా మారిపోయే మనసు. తండ్రిప్రేమ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి సవతి తల్లిని కిరాతకంగా హతమార్చారు. సవతి తల్లి అనే కనికరం కూడా లేకుండా ఆమెను కత్తితో నరికి చంపారు. వారిద్దరినీ నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి తమ తల్లితో ఉండకుండా.. సవతి తల్లి వద్దే ఎక్కువ సమయం ఉంటున్నాడనే కోపంతో వారిద్దరూ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరు హరిజనవాడకు చెందిన గోళ్ల చిన్నమ్మ, దాసరి శివయ్యకు 24ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి వారు విడిపోయారు. 12 ఏళ్ల క్రితం ఇందుకూరు పేట మండలానికి చెందిన మాధురిని వివాహం చేసుకున్నాడు శివయ్య. మాధురి, శివయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు సర్వేపల్లిలో కాపురం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శివయ్య తన మొదటి భార్య దగ్గరకు రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కొడుకులతో ఆ విషయంలో గొడవలు అవుతున్నా శివయ్య మాత్రం మొదటి భార్య దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి తమకు దూరమవుతున్నాడన్నకోపంతో వంశీ, నితీష్ ఇద్దరూ తమ తండ్రి మొదటి భార్య చిన్నమ్మను దారుణంగా నరికి హత్య చేశారు. నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

మొదటి భార్య వద్దకు వెళ్లొద్దని 

చిన్నమ్మకు సంతానం లేదు. భర్త వదిలేసిన తర్వాత తన పని తాను చేసుకుంటోంది. ఒంటరిగానే వేగూరు హరిజనవాడలో జీవిస్తోంది. కొన్నాళ్లుగా భర్త తన వద్దకు వస్తుండటంతో ఆమె తిరిగి సంతోషపడింది. గతంలో తనను దూరం పెట్టిన భర్త తిరిగి తన వద్దకు వస్తున్నాడని బంధువులకు చెప్పుకుని సంతోషంగా ఉంటోంది. అయితే శివయ్య రెండో భార్య మాధురికి, ఆమె కొడుకులకు అది ఇష్టంలేదు. చాలా సార్లు ఈ విషయంలో తండ్రి శివయ్యను ఇద్దరు కొడుకులు వారించారు. మొదటి భార్య వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

తండ్రి పట్టించుకోడనే అనుమానంతో 

పిల్లల మాటను పెడచెవిన పెట్టారు శివయ్య. మొదటి భార్య వద్దకు రాకపోకలు సాగించాడు. కొన్నిరోజులపాటు ఆమెవద్ద ఉంటుండే సరికి కొడుకులకు అనుమానం మరింతబలపడింది. తమని తండ్రి పూర్తిగా దూరం పెడతాడేమోనన్న ఆందోళన పెరిగింది. తమ తల్లి ఒంటరి అవుతోందనే బాధ మొదలైంది. అంతే వారు క్షణికావేశంలో ఏం చేస్తున్నామనే విషయాన్ని మరచిపోయారు. తమకి ఎలాంటి హాని తలపెట్టకపోయినా, కేవలం తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న బాధతో సవతి తల్లిని దారుణంగా హత్య చేశారు. వారిద్దరినీ పోలీసులు సర్వేపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. క్షణికావేశంలో తప్పు చేసి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. వారిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్టు తెలిపారు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Civils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP DesamGujarati couple donates 200 crore | సంపాదన మీద విరక్తితో 200కోట్లు పంచుతున్న దంపతులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
Embed widget