అన్వేషించండి

Anil Kumar Yadav: నారా లోకేశ్‌కు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సవాల్, ఆలయానికి రావాలని డిమాండ్

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ భూ అక్రమాలకు పాల్పడ్డారని, బినామీల పేరుతో దందాలు చేశారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై తాజాగా అనిల్ స్పందించారు.

MLA Anil Kumar Yadav Challenges Nara Lokesh: నాలుగేళ్లలో తాను వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించానని నారా లోకేష్ (Nara Lokesh) అవాస్తవ ఆరోపణలు చేశారని మండిపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ విడుదల చేసిన జాబితాలో  ఒక్క అంకణం కూడా తనకు తన బినామీలకు చెందినది కాదని, ఒకవేళ తనదే అని లోకేష్ నిరూపిస్తే వారికే ఆ స్థలాలను ఇచ్చి వేస్తానని అన్నారు. అక్కడితో అనిల్ కుమార్ ఆగలేదు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆస్తులకు సంబంధించి నెల్లూరు వెంకటేశ్వరపురంలో తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు అనిల్. దమ్ముంటే నారా లోకేష్ ప్రమాణానికి రావాలని సవాలు విసిరారు. ఆయన రాకపోయినా తాను మాత్రం వెంకటేశ్వర పురం వెళ్లి ప్రమాణం చేస్తానని అనిల్ (MLA Anil Kumar Yadav) అన్నారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ (MLA Anil Kumar Yadav) భూ అక్రమాలకు పాల్పడ్డారని, బినామీల పేరుతో దందాలు చేశారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించారు. మంగళవారం (జూలై 4) నెల్లూరు నగరంలో జరిగిన బహిరంగ సభలో అనిల్‌ భూకబ్జాలు, అక్రమాలు అంటూ ఆరోపణలు చేశారు. బినామీల పేర్లతో రూ.వెయ్యి కోట్లు దోచుకున్నారని లోకేశ్ ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలను నిన్న (జూలై 5) కోవూరు నియోజకవర్గంలోని సాలుచింతలలో విడుదల చేశారు. ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే అనిల్‌ చెప్పాలని, అసలు ఆయనకు ఈసారి టికెట్‌ ఇస్తారో లేదో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. తాను అవినీతికి పాల్పడలేదని అనిల్‌ వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయాలని నారా లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

నారా లోకేశ్ విడుదల చేసిన లిస్టు ఇదీ

మాజీ మంత్రి అనిల్ దోచుకున్నారని నారా లోకేశ్‌ విడుదల చేసిన లిస్టులో ఈ వివరాలు ఉన్నాయి. ‘‘నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు దోచుకున్నారు. వాటి విలువ రూ.100 కోట్లు. దొంతాలివద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరుపై 50 ఎకరాలు కాజేయగా వాటి విలువ రూ.10 కోట్లుగా ఉంది. సాదరపాళెంలో డాక్టర్‌ అశ్విన్‌ పేరుతో 12 ఎకరాల విలువ రూ.48 కోట్లుగా ఉంది. ఇనుమడుగు వద్ద బినామీలు రాకేశ్‌, డాక్టర్‌ అశ్విన్‌ (అనిల్‌ తమ్ముడు) పేరుతో 400 అంకణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.33 కోట్లుగా ఉంది. అల్లీపురంలో 4వ డివిజన్‌ కార్పొరేటర్‌, డాక్టర్‌ అశ్విన్‌ పేరుతో 42 ఎకరాలు కాజేశారు. వాటి విలువ రూ.105 కోట్లుగా ఉంది. ఇందులో 7 ఎకరాలు  ఇరిగేషన్‌ భూమిగా ఉంది’’

‘‘గూడూరు - చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు తీసుకున్నారు. అందులోని 40 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. పెద్ద కాంట్రాక్టర్‌ నుంచి దశల వారీగా అనిల్‌ బినామీ చిరంజీవికి రూ.కోట్లు వచ్చాయి. బృందావనంలో శెట్టి సురేష్‌ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.25 కోట్లు. దామరమడుగులో బావమరిది పేరుతో 5 ఎకరాలు ఉండగా వాటి విలువ రూ.5 కోట్లుగా ఉంద’’ని నారా లోకేశ్ విడుదల చేసిన జాబితాలో ఆరోపణలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.