News
News
వీడియోలు ఆటలు
X

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

కోవూరు టికెట్ వేరే వారికి ఇస్తానని జగన్ తనకు చెప్పినా కూడా తాను పార్టీని వీడిపోనని, ఆయన నిలబెట్టిన అభ్యర్థినే గెలిపిస్తానని చెప్పారు. తాను చనిపోయే వరకు జగన్ తోనే ఉంటానన్నారు ఎమ్మెల్యే ప్రసన్న.

FOLLOW US: 
Share:

నెల్లూరు జిల్లాలో వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, అది కూడా సీఎం జగన్ సొంత సామాజిక వర్గం వారు పార్టీపై విమర్శలు చేయడంతో రాజకీయం వేడెక్కింది. అదే కోవలో మరో పెద్దారెడ్డి కూడా పార్టీకీ దూరమవుతారనే ప్రచారం జరిగింది. ఆయనెవరో కాదు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. టీడీపీలోనుంచి వైసీపీకి వచ్చిన ఆయన, తిరిగి టీడీపీ లేదా బీజేపీ గూటికి చేరతారంటూ సోమవారం వాట్సప్ లో వైరల్ న్యూస్ ఫార్వార్డ్ అయింది. దీన్ని చూసి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కూడా ప్రసన్న పార్టీ మారిపోతున్నారంటూ కథనాలిచ్చాయి. ఈ కథనాలపై  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ యూట్యూబ్ ఛానెళ్ల వారికి కనీసం నీతి నిజాయితీ ఉన్నాయా అని ప్రశ్నించారు. వారేమైనా రెడ్ లైట్ ఏరియాలో పుట్టారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్రసన్నపై ఎందుకీ ప్రచారం..
ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత, వైసీపీలో మొదటి నుంచీ జగన్ కి నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశించి ఉండొచ్చు, కానీ నేరుగా ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పుడు అదే మంత్రి పదవి విషయంలో ఆయన అలిగారని, అందుకే పార్టీ మారుతున్నారని వాట్సప్ లో స్ ఫార్వార్డ్ అయింది. అయితే ప్రసన్న మాత్రం ఆ వార్తల్ని ఖండించారు. తప్పుడు వార్తలతో తన ఇమేజ్ డ్యామేజీ అయిందన్నారు ప్రసన్న. అందరూ తనకు ఫోన్లు చేసి అడుగుతున్నారని, వారికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడ్డానన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పినా కొంతమంది అనుమానంగా ఫోన్లు పెట్టేశారని చెప్పొరు ప్రసన్న. తానంటే గిట్టనివారు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ప్రసన్న.

చివరి రక్తపు బొట్టు వరకూ.. 
తనపై సోషల్ మీడియాలో వచ్చినవన్నీ తప్పుడు కథనాలే అని మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు టికెట్ వేరేవారికి ఇస్తానని జగన్ తనకు చెప్పినా కూడా తాను పార్టీని వీడిపోనని, ఆయన నిలబెట్టిన అభ్యర్థినే గెలిపిస్తానని చెప్పారు. తనకు జగన్ చాలా గౌరవం ఇస్తారని, తాను అడిగిన పనులన్నీ పూర్తి చేస్తున్నారని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానెళ్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారంతా రెడ్ లైట్ ఏరియాలో పుట్టినట్టు ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయే వరకు జగన్ తోనే ఉంటానన్నారు. తన చివరి రక్తపు బొట్టు కూడా జగన్ కోసమేనని స్పష్టం చేశారు. తాను చనిపోయిన తర్వాత తన కొడుకు రజత్ కుమార్ రెడ్డి జగన్ తోనే కొనసాగుతాడని అన్నారు. 

చంద్రబాబుపై అనుమానం.. 
తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించి ఉంటారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు డబ్బులిచ్చి ఈ వార్తలు వేయించారన్నారు. మీడియా మొత్తాన్ని తాను విమర్శించడంలేదని, తనని టార్గెట్ చేసిన వారిపై మాత్రమే తన ఆగ్రహం అని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసిందని, వారు టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినట్టు నిర్థారణ అయిందని చెప్పారు ప్రసన్న. తాను అలాంటి వాడిని కాదన్నారు.

Published at : 28 Mar 2023 11:39 AM (IST) Tags: nallapureddy prasanna kumar reddy Nellore MLA Nellore News mla prasanna Nellore Politics

సంబంధిత కథనాలు

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆనం- రాష్ట్రంలో మార్పు మొదలైందని కామెంట్

టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆనం- రాష్ట్రంలో మార్పు మొదలైందని కామెంట్

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు- వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ లీడర్ల భేటీ

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు- వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ లీడర్ల భేటీ

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!