అన్వేషించండి

యువగళం పూర్తయ్యేసరికి టీడీపీ నెత్తిన తడిగుడ్డే- చంద్రబాబు, లోకేష్, పవన్ కి ఎమ్మెల్యే అనిల్ సెటైర్లు

లోకేష్ పాదయాత్ర పూర్తయ్యేలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకోవడం ఖాయమన్నారు. పవన్ కల్యాణ్ కి కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని చెప్పారు అనిల్.

వైనాట్ -175 అంటూ ప్రతిపక్షాలను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతూనే, తాజాగా ప్రతిపక్షాలను కార్నర్ చేశారు. ప్రతిపక్షాలు కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించగలవా అని ప్రశ్నిస్తున్నారు జగన్. కేవలం జగన్ ప్రశ్నించి వదిలేస్తే ఓకే, కానీ ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ అదే ప్రశ్న అడిగిస్తున్నారు. అంటే ఒకరకంగా ప్రతిపక్షాలపై జగన్ ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టమవుతోంది.

సింగిల్ గా వస్తారా..

ప్రతిపక్షాల కచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేస్తాయి. పులివెందులలో కూడా అభ్యర్థిని నిలబెడతాయి. కానీ ఇక్కడ జగన్ అడుగుతోంది ఒక్కటే. ప్రతిపక్షాలు విడివిడిగా 175 స్థానాల్లో పోటీ చయగలవా అని అడుగుతున్నారు. అంటే ప్రతిపక్షాలకు విడివిడిగా అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందా అంటూ పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. తెనాలిలో రైతు భరోసా సభ తర్వాత మంత్రి కాకాణి కూడా మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న సంధించారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో కూడా 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కి.. మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. టీడీపీ, జనసేనకు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. తమకు పొత్తులు అవసరం లేదని, అప్పుడు సింగిల్ గానే పోటీ చేశామని, ఇప్పుడు కూడా సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పారు. టిడిపి, జనసేన కు ఆ సత్తా ఉందా అని సవాల్ విసిరారు. దమ్ముంటే యువగళం పాదయాత్రలో ఆమేరకు లోకేష్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అనిల్. కనీసం పోటీ చేసే స్థానాల సంఖ్య చెప్పుకోలేని పార్టీలు, సీఎం జగన్ గురించి మాట్లాడతాయా అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు అనిల్.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాదే..

పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు.  టీడీపీ హయాంలో కంటే తమ హయాంలోనే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చామని చెప్పారు మాజీ మంత్రి అనిల్. టీచర్లకు కూడా తమ హయాంలోనే ఎక్కువ బెనిఫిట్స్ లభించాయని చెప్పారు. పట్టభద్రులు, టీచర్లు తమకే మద్దతు తెలపాలన్నారు. సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

టీడీపీ, జనసేనకు సింగిల్ గా పోటీ చేసే సత్తా లేదని అందుకే వారంతా కలసి పోటీ చేయాలనుకుంటున్నారని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. దమ్ముంటే వారు సింగిల్ గా పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యేలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకోవడం ఖాయమన్నారు. పవన్ కల్యాణ్ కి కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని చెప్పారు అనిల్. మొత్తమ్మీద ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయాలని అధికార పక్షం కోరుకుంటున్నట్టుంది. అందుకే ఇప్పుడు నేతలు సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే విడివిడిగా రండి, పోటీ చేస్తామని ప్రకటించండి అంటున్నారు వైసీపీ నేతలు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget