అన్వేషించండి

Fish Drying Machine: చేప ఎండితే మంచిదే - ఎన్నాళ్లయినా ఫ్రెష్‌గా ఉండాల్సిందే

ఏడు చేపల కథలో.. చేపా చేపా ఎందుకు ఎండలేదంటే.. గడ్డిపోచలు అడ్డమొచ్చాయని చెబుతుందని చదువుకున్నాం. అది కథే అయినా, ఇకపై అలాంటి అవాంతరాలు లేకుండా చేపల్ని ఎండబెట్టేందుకు ఓ మిషన్ అందుబాటులోకి వచ్చింది.

Fish Dehydrator: ఏడు చేపల కథలో.. చేపా చేపా ఎందుకు ఎండలేదంటే.. గడ్డిపోచలు అడ్డమొచ్చాయని చెబుతుందని చదువుకున్నాం. అది కథే అయినా, ఇకపై అలాంటి అవాంతరాలు లేకుండా చేపల్ని ఎండబెట్టేందుకు ఓ మిషన్ అందుబాటులోకి వచ్చింది. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జీవుల్ని ఎండబెట్టి నిల్వ చేసుకునే మిషన్ ఇది. సహజంగా సూర్య రశ్మితో చేపల్ని, రొయ్యల్ని ఎండబెట్టాలంటే రోజుల తరబడి వాటిని ఎండలో ఉంచాలి. ఎండిన తర్వాత వాటికి అంటుకున్న ఇసుక ఓ పట్టాన పోదు, వాటిని తిరిగి శుభ్రం చేసుకోవాలి. కానీ డి హుమిడిఫయర్ అనే ఈ మిషన్ (Fish Drying Machine) ద్వారా అలాంటి ఇబ్బందుల్లేకుండా చేపల్ని ఎండబెట్టుకోవచ్చు.

వారం రోజుల పని 8 గంటల్లోనే..  
సహజంగా చేపల్ని ఎండబెట్టాలంటే, వారం రోజులపాటు ఎండలో ఉంచాలి. కొన్నింటిని అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుభ్రపరిచి మార్కెట్లోకి తెచ్చి అమ్ముతుంటారు. కానీ డి హుమిడిఫయర్ల ద్వారా చేపల్ని 8 గంటల నుంచి గరిష్టంగా 24 గంటల్లోనే ఎండబెట్టొచ్చు. వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు కూడా ఉండవు. ఇలా ఎండినవాటిని వాక్యూమ్ ప్యాకేజింగ్ ద్వారా ఎక్కువ రోజులు, ఏడాదిపాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. 


Fish Drying Machine: చేప ఎండితే మంచిదే - ఎన్నాళ్లయినా ఫ్రెష్‌గా ఉండాల్సిందే

చేపలు, రొయ్యలు ఎండబెట్టాలంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడమే ఇప్పటి వరకూ మనకు అలవాటు. కానీ విదేశాల్లో మాత్రం చేపలు, రొయ్యలను ఎండబెట్టడానికి హుమిడిఫయర్లను విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నాలటీ ఇటీవలే భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన సంస్థ ఈ హుమిడిఫయర్లను తయారు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వీటిని మత్స్యకారులకు అందిస్తోంది. నెల్లూరులో ఇటీవల జరిగిన మత్స్యకార సదస్సులో ఈ హుమిడిఫయర్లకోసం ప్రత్యేకంగా ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. 

కరెంటుతో పనిచేసే ఈ హుమిడిఫయర్లు పదార్థాల్లో ఉన్న తేమను హరించివేస్తాయి. వాటిని ఎండబెడతాయి. ఇక్కడ ఎండబెట్టే పద్ధతి వేరేగా ఉంటుంది. ఓజోన్ సాయంతో హుమిడిఫయర్లలో పదార్థాలను ఎండబెడతామంటున్నారు. వీటి ద్వారా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయని, ఏడాది వరకు పదార్థాలు చెడిపోకుండా ఉంటాయని చెబుతున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు జగన్ మోహన్ రావు. 

Fish Drying Machine: చేప ఎండితే మంచిదే - ఎన్నాళ్లయినా ఫ్రెష్‌గా ఉండాల్సిందే

విదేశాల్లో ఎక్కువగా హుమిడిఫయర్లను ఉపయోగిస్తుంటారు. పండ్లను ఇలా ఎండబెడుతుంటారు. యాపిల్స్ ని కూడా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకుని అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు. భారత్ లో మాత్రం ప్రస్తుతానికి ఇలాంటి హుమిడిఫయర్ల వాడకం ఇంకా ఊపందుకోలేదు.


Fish Drying Machine: చేప ఎండితే మంచిదే - ఎన్నాళ్లయినా ఫ్రెష్‌గా ఉండాల్సిందే

దక్షిణ భారత్ లో చెన్నై కేంద్రంగా వీటిని వినియోగంలోకి తెస్తున్నట్టు చెబుతున్నారు. సీ ఫుడ్స్ మాత్రమే కాకుండా పండ్లు, ఎండు మిర్చి వంటి వాటిని కూడా హమిడిఫయర్ల ద్వారా తేమను తీసేసి ఎండబెడతారు. ఆ తర్వాత వాటిని వ్యాక్యూమ్ ప్యాకింగ్ ద్వారా భద్రపరిస్తే.. ఏడాది వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని చెబుతున్నారు. 


Fish Drying Machine: చేప ఎండితే మంచిదే - ఎన్నాళ్లయినా ఫ్రెష్‌గా ఉండాల్సిందే

భారత్ లో డిహుమిడిఫయర్ల వాడకం తక్కువగానే ఉంది. విదేశాల్లో మాత్రం వీటిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం భారత్ లో కూడా వీటిని మత్స్యకారులకు పరిచయం చేస్తోంది ప్రభుత్వం. సబ్సిడీపై వీటిని అందిస్తోంది. తక్కువ విద్యుత్ ఖర్చుతోనే వీటిని ఉపయోగించుకోవచ్చు. లక్ష నుంచి 6 లక్షల వరకు వీటి ధర ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Advertisement

వీడియోలు

Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
India vs South Africa Second Test Match Highlights | భారీ స్కోరుకు సఫారీల ఆలౌట్ | ABP Desam
India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
India vs South Africa: గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
Smriti Mandhana: స్మృతి మంధాన పలాష్ ముచ్చల్‌తో పెళ్లి బంధం తెంచుకున్నారా? ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు తొలగించారా?
స్మృతి మంధాన పలాష్ ముచ్చల్‌తో పెళ్లి బంధం తెంచుకున్నారా? ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు తొలగించారా?
Cheating bride: పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
Keerthy Suresh : 'మహానటి' తర్వాత గ్యాప్ - అసలు రీజన్ ఏంటో చెప్పిన కీర్తి సురేష్
'మహానటి' తర్వాత గ్యాప్ - అసలు రీజన్ ఏంటో చెప్పిన కీర్తి సురేష్
Embed widget