అన్వేషించండి

YS Jagan Nellore Visit: ఈనెల 20న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్, పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన - బహిరంగసభకు ప్లాన్

ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. ఈనెల 20వతేదీన రామాయపట్నం ఓడరేవు శంకుస్థాపనకోసం సీఎం గుడ్లూరు మండలం మొండివారిపాలెంకు రాబోతున్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన జిల్లాలోని గుడ్లూరు మండలం మొండివారి పాలెంకు వెళ్లనున్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు నెల్లూరు జిల్లాలో వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామాయపట్నం ఓడరేవు శంకుస్థాపన కార్యక్రమం కోసం సీఎం జగన్ గుడ్లూరు మండలం మొండివారిపాలెంకు రాబోతున్నారు. రామాయటప్నం పోర్ట్ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ఇటీవల దానికి అనుమతులు లభించాయి. దీంతో సీఎం జగన్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మొండివారిపాలెం వెళ్తున్నారు. 

జూలై 20వ తేదీ బుధవారం ఉదయం 9.15 గంటలకు ముఖ్యమంత్రి గుడ్లూరుకు చేరుకుంటారు. అక్కడ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం అక్కడే బహిరంగ సభ ఉంటుంది. సీఎం హెలికాప్టర్లో గుడ్లూరు వస్తున్నందున అక్కడ హెలీప్యాడ్ సిద్ధం చేశారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొండివారిపాలెంలో వారు పర్యటించారు. సీఎం పర్యటనకు వివిధ శాఖల అధికారులను సన్నద్ధం చేశామని చెప్పారు. 

ఓడరేవు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓడరేవు వల్ల స్థలాలు, పొలాలు కోల్పోతున్నవారికి మెరుగైన నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఓడరేవుతో మరో 3,200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఓడరేవుకోసం 2,500 ఎకరాలు కేటాయించామని చెప్పారు. 

బహిరంగ సభ జరిగేది ఎక్కడంటే..
ఓడరేవు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ ఎక్కడ పెట్టాలనేదానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. శంకుస్థాపన ప్రాంతం సముద్ర తీరానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే సభ పెడితే సముద్ర గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. టెంట్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉండదని అధికారులు ఆలోచిస్తున్నారు. దీంతో సాలిపేట-రావూరు పొలాల్లో బహిరంగ సభ వేదిక సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు. 

ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ తొలి పర్యటన ఇదే అవుతుంది. గతేడాది వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ నెల్లూరు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదు. కనీసం ఇప్పుడు జిల్లా పర్యటనలో అయినా వాటి గురించిప్రస్తావిస్తారేమో చూడాలి. మరోవైపు సీఎం పర్యటన కోసం అధికారులు, స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget