అన్వేషించండి

YS Jagan Nellore Visit: ఈనెల 20న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్, పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన - బహిరంగసభకు ప్లాన్

ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. ఈనెల 20వతేదీన రామాయపట్నం ఓడరేవు శంకుస్థాపనకోసం సీఎం గుడ్లూరు మండలం మొండివారిపాలెంకు రాబోతున్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన జిల్లాలోని గుడ్లూరు మండలం మొండివారి పాలెంకు వెళ్లనున్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు నెల్లూరు జిల్లాలో వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామాయపట్నం ఓడరేవు శంకుస్థాపన కార్యక్రమం కోసం సీఎం జగన్ గుడ్లూరు మండలం మొండివారిపాలెంకు రాబోతున్నారు. రామాయటప్నం పోర్ట్ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ఇటీవల దానికి అనుమతులు లభించాయి. దీంతో సీఎం జగన్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మొండివారిపాలెం వెళ్తున్నారు. 

జూలై 20వ తేదీ బుధవారం ఉదయం 9.15 గంటలకు ముఖ్యమంత్రి గుడ్లూరుకు చేరుకుంటారు. అక్కడ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం అక్కడే బహిరంగ సభ ఉంటుంది. సీఎం హెలికాప్టర్లో గుడ్లూరు వస్తున్నందున అక్కడ హెలీప్యాడ్ సిద్ధం చేశారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొండివారిపాలెంలో వారు పర్యటించారు. సీఎం పర్యటనకు వివిధ శాఖల అధికారులను సన్నద్ధం చేశామని చెప్పారు. 

ఓడరేవు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓడరేవు వల్ల స్థలాలు, పొలాలు కోల్పోతున్నవారికి మెరుగైన నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఓడరేవుతో మరో 3,200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఓడరేవుకోసం 2,500 ఎకరాలు కేటాయించామని చెప్పారు. 

బహిరంగ సభ జరిగేది ఎక్కడంటే..
ఓడరేవు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ ఎక్కడ పెట్టాలనేదానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. శంకుస్థాపన ప్రాంతం సముద్ర తీరానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే సభ పెడితే సముద్ర గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. టెంట్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉండదని అధికారులు ఆలోచిస్తున్నారు. దీంతో సాలిపేట-రావూరు పొలాల్లో బహిరంగ సభ వేదిక సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు. 

ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ తొలి పర్యటన ఇదే అవుతుంది. గతేడాది వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ నెల్లూరు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదు. కనీసం ఇప్పుడు జిల్లా పర్యటనలో అయినా వాటి గురించిప్రస్తావిస్తారేమో చూడాలి. మరోవైపు సీఎం పర్యటన కోసం అధికారులు, స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget