అన్వేషించండి

Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

తన ఫోన్లు, తన పీఏ ఫోన్లు కూడా ఏడాదిన్నరగా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆఫ్ ది రికార్డ్ చెప్పాల్సిన ఖర్మ పట్టలేదని, తాను ఆన్ రికార్డే చెబుతున్నానన్నారు రామనారాయణ రెడ్డి.

Nellore Anam  :  నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై రచ్చ చేయగా, తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు.   తాను ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడ్డంలేదని, ఆన్ రికార్డే చెబుతున్నానని చెప్పారు. సొంత పార్టీ వాళ్లే ట్యాప్ చేస్తే ఇక తానెవరికి చెప్పుకోవాలన్నారు ఆనం. 

ఎప్పటినుంచంటే..?

తన ఫోన్లు, తన పీఏ ఫోన్లు కూడా ఏడాదిన్నరగా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్ లు  రాజ్యమేలుతున్నాయని తాను ఏడాదిన్నర క్రితం కామెంట్లు చేసినప్పటి నుంచి తన ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయని అన్నారు. ఆఫ్ ది రికార్డ్ చెప్పాల్సిన ఖర్మ పట్టలేదని, తాను ఆన్ రికార్డే చెబుతున్నానన్నారు రామనారాయణ రెడ్డి. ముఖ్యమైన సందేశాలుంటే వాట్సప్, ఫేస్ టైమ్ యాప్ ద్వారా కాల్స్ చేసుకుంటున్నానని చెప్పారు. కన్న కూతురితో  ఫోన్లో మాట్లాడాలనుకున్నా ఫేస్ టైమ్ వీడియో కాల్ లో మాట్లాడుతున్నానని చెప్పారు. అధికార పార్టీయే ట్యాప్ చేస్తున్నప్పుడు ఇక నేనెవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. 

ప్రాణహాని ఉందన్న ఆనం  

తనకు భద్రత తగ్గించారని.. ఉన్న భధ్రతను కూడా తీసేయాలని ఆనం ప్రభుత్వాన్ని కోరారు. తన ప్రాణానికి ముప్పు ఉందన్నారు. ప్రాణఆలు తీసేందుకు కూడా తెగిస్తున్నారని.. తాను దేనికైనా సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను చనిపోతే తన లాంటి వాళ్లు మరో పది మంది పుట్టుకు వస్తారన్నారు.  ఇలాంటి పోకడలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్థానికంగా ఉన్న అధికారులను మార్చడంతో పాటూ తన భద్రతను కూడా తగ్గించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా తన సెక్యూరిటీని తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ప్రమేయం లేకుండానే సెక్యూరిటీని తొలగించారని తెలిపారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాల్సి ఉందని ఆనం పేర్కొన్నారు.

అధికార పార్టీ మెడకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! 

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికార పార్టీ మెడకు చుట్టుకునే అవకాశముంది. సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారంటే, ఇక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఫోన్లు కూడా కచ్చితంగా ట్యాప్ చేస్తుంటారనే అపప్రధ బలపడుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేసే అవకాశముంది. నెల్లూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇలాగే ముందుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే కచ్చితంగా దీనిపై ప్రభుత్వం లేదే పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టాల్సి రావొచ్చంటున్నరాు.  తమ తప్పు లేదని చెప్పుకోడానికైనా వారు ఏదో ఒక స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉందని చచెబుతున్నారు. 

ఆనం పరిస్థితి ఏంటి..?

ఇటీవల ఆనంకు వైసీపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డి ఉన్నా కూడా పార్టీ తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించడంతో కలకలం రేగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆనం అధికారాలకు కత్తెర పడింది. అధికారుల్ని మార్చేసిన రామ్ కుమార్ రెడ్డి, ఆనంను సభలు, సమావేశాలకు రావొద్దన్నారు. గడప గడప కార్యక్రమానికి కూడా ఆయన్ను తిరగనివ్వడంలేదు. ఈ దశలో ఆనం రామనారాయణ రెడ్డి ఆ ఎపిసోడ్ పై తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగేతర శక్తుల్ని నియమించడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను కాదని, రాజ్యాంగేతర శక్తుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నిలదీశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు చూశానన్నారు. పోలీస్ సెక్యూరిటీ కూడా తనకు తగ్గించేశారని, ఎవరి ఆత్మవంచనకోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎన్నికలకింకా 15 నెలలు సమయం ఉందన్నారు. నాలుగేళ్ల పాలనలోనే వైసీపీ సమర్థతపై చర్చ మొదలవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలే అధికారం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా ఆనం నోరు విప్పడంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Breaking News: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడు- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు 
ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడు- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు 
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
Nellore Crime News: మేం లేకుండా ఒంటరిగా బతకలేడు..! భార్య, కుమారుడికి ఉరివేసి రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య
మేం లేకుండా ఒంటరిగా బతకలేడు..! భార్య, కుమారుడికి ఉరివేసి రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Embed widget