అన్వేషించండి

Atchannaidu About Jagan: వివేకా హత్యకేసు డైవర్షన్ కోసమే జగన్ విశాఖ పేరెత్తారు - అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

సరిగ్గా వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో జగన్.. సెప్టెంబర్ మాసం అంటూ హింటివ్వడం మాత్రం విశేషం. అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతోంది. 

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని వ్యవహారం గురించి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ పాలనా రాజధాని అవుతుందన్నారు. అక్కడినుంచే పాలన మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు కాబట్టే ఉత్తరాంధ్ర పాలనా రాజధానికి కేంద్ర అవుతుందని చెప్పారా, లేక కారణం ఇంకేదయినా ఉందా..? టీడీపీ మాత్రం జగన్ పై మండిపడుతోంది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హాట్ టాపిక్ గా ఉందని, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే జగన్ ఇలా మాట్లాడారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

మాజీ  వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే కొత్తగా విశాఖ నుంచి పాలన అనే విషయాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అసలు కోర్టులో కేసు ఉండగా.. జగన్ విశాఖకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని, ఎప్పుడైనా అది పడిపోవచ్చని, ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు అచ్చెన్నాయుడు. నెల్లూరు నగరంలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. 

వాస్తవానికి విశాఖ పాలనా రాజధాని విషయంలో జగన్ ఇప్పటికే చాలా డెడ్ లైన్లు పెట్టారు, అన్నీ దాటిపోయాయి. కోర్టులో కేసు ఉండగా జగన్ ఇలాంటి సాహసం చేయరని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆయన రాజధానిపై ప్రకటన చేశారు. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ, సెప్టెంబర్ అంటూ హింట్ ఇచ్చారు. అంటే సెప్టెంబర్ నాటికి అక్కడ నిర్మాణాలు పూర్తవుతాయా..? లేక ఇంకేదయినా మహూర్తం ఉందా అనేది మాత్రం తేలలేదు. 

ఈసారి నమ్మవచ్చా..?
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల గురించి ప్రకటించారు. మండలిలో బిల్లు తిరస్కరణకు గురి కావడం, కోర్టు కేసులు, అమరావతి రైతుల యాత్రలతో అది అప్పటికప్పుడు సాధ్యం కాలేదు. కానీ జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూనే ఉన్నారు. విశాఖలోని రుషికొండలో రాజధానికోసం భవనాలు నిర్మిస్తున్నారు. త్వరలోనే అక్కడికి పూర్తి సరంజామాతో వెళ్తారని అంటున్నారు. కానీ ఎన్నికల ఏడాదిలోగా అది సాధ్యమయ్యేట్టు కనిపించలేదు. ఆ మధ్య విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో పాలనా రాజధానికి ఓ ఊపు వచ్చింది. ఆ తర్వాత కూడా జగన్ క్లారిటీగా ప్రకటన చేయలేదు. 2023-24 విద్యా సంవత్సరానికి అంతా సెట్ అవుతుందనుకున్నా.. జగన్ ఎటూ కాకుండా సెప్టెంబర్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ టైమ్ కి సచివాలయ ఉద్యోగులంతా కుటుంబాలతో సహా విశాఖకు షిప్ట్ అవ్వాల్సిందే. లేదంటా మరోసారి విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం వాయిదా పడొచ్చు. 

ఏపీ సీఎం జగన్ ఆలోచన ఎలా ఉన్నా.. సరిగ్గా వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో ఆయన సెప్టెంబర్ మాసం అంటూ హింటివ్వడం మాత్రం విశేషం. అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget