అన్వేషించండి

Atchannaidu About Jagan: వివేకా హత్యకేసు డైవర్షన్ కోసమే జగన్ విశాఖ పేరెత్తారు - అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

సరిగ్గా వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో జగన్.. సెప్టెంబర్ మాసం అంటూ హింటివ్వడం మాత్రం విశేషం. అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతోంది. 

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని వ్యవహారం గురించి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ పాలనా రాజధాని అవుతుందన్నారు. అక్కడినుంచే పాలన మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు కాబట్టే ఉత్తరాంధ్ర పాలనా రాజధానికి కేంద్ర అవుతుందని చెప్పారా, లేక కారణం ఇంకేదయినా ఉందా..? టీడీపీ మాత్రం జగన్ పై మండిపడుతోంది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హాట్ టాపిక్ గా ఉందని, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే జగన్ ఇలా మాట్లాడారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

మాజీ  వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే కొత్తగా విశాఖ నుంచి పాలన అనే విషయాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అసలు కోర్టులో కేసు ఉండగా.. జగన్ విశాఖకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని, ఎప్పుడైనా అది పడిపోవచ్చని, ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు అచ్చెన్నాయుడు. నెల్లూరు నగరంలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. 

వాస్తవానికి విశాఖ పాలనా రాజధాని విషయంలో జగన్ ఇప్పటికే చాలా డెడ్ లైన్లు పెట్టారు, అన్నీ దాటిపోయాయి. కోర్టులో కేసు ఉండగా జగన్ ఇలాంటి సాహసం చేయరని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆయన రాజధానిపై ప్రకటన చేశారు. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ, సెప్టెంబర్ అంటూ హింట్ ఇచ్చారు. అంటే సెప్టెంబర్ నాటికి అక్కడ నిర్మాణాలు పూర్తవుతాయా..? లేక ఇంకేదయినా మహూర్తం ఉందా అనేది మాత్రం తేలలేదు. 

ఈసారి నమ్మవచ్చా..?
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల గురించి ప్రకటించారు. మండలిలో బిల్లు తిరస్కరణకు గురి కావడం, కోర్టు కేసులు, అమరావతి రైతుల యాత్రలతో అది అప్పటికప్పుడు సాధ్యం కాలేదు. కానీ జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూనే ఉన్నారు. విశాఖలోని రుషికొండలో రాజధానికోసం భవనాలు నిర్మిస్తున్నారు. త్వరలోనే అక్కడికి పూర్తి సరంజామాతో వెళ్తారని అంటున్నారు. కానీ ఎన్నికల ఏడాదిలోగా అది సాధ్యమయ్యేట్టు కనిపించలేదు. ఆ మధ్య విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో పాలనా రాజధానికి ఓ ఊపు వచ్చింది. ఆ తర్వాత కూడా జగన్ క్లారిటీగా ప్రకటన చేయలేదు. 2023-24 విద్యా సంవత్సరానికి అంతా సెట్ అవుతుందనుకున్నా.. జగన్ ఎటూ కాకుండా సెప్టెంబర్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ టైమ్ కి సచివాలయ ఉద్యోగులంతా కుటుంబాలతో సహా విశాఖకు షిప్ట్ అవ్వాల్సిందే. లేదంటా మరోసారి విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం వాయిదా పడొచ్చు. 

ఏపీ సీఎం జగన్ ఆలోచన ఎలా ఉన్నా.. సరిగ్గా వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఏపీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో ఆయన సెప్టెంబర్ మాసం అంటూ హింటివ్వడం మాత్రం విశేషం. అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget