అన్వేషించండి

Amaravati Womens Issue: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు - జాతీయ మహిళా కమిషన్ సీరియస్ - ఏపీ డీజీపీకి ఆదేశాలు

NCW: అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉమెన్స్ కమిషన్ ఆదేశించింది. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపికి లేఖ పంపింది.

Amaravati :  ఓ టీవీ చానల్ డిబేట్‌లో అమరావతి మహిళల్ని వేశ్యలుగా అభివర్ణించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది. ఈ అంశాన్ని  జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ సుమోటోగా తీసుకున్నారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలతో ఈ చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల్లో కృష్ణంరాజును అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. 

అసలేం జరిగిందంటే ?

వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి చెందిన సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు, చంద్రబాబు నాయుడు అమరావతిని "దేవతల రాజధాని" అని పిలవడాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా అది దేవతల రాజధాని కాదని   "వేశ్యల రాజధాని" అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు, హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారని, దీనిని ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక ఆధారంగా చెప్పారు. సాక్షి టీవీ చర్చను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఆధారంగా చూపారు, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కానీ అందులో అసలు అమరావతి ప్రస్తావనే లేదని చెబుతున్నారు. 

ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్ని సామాజిక వర్గాల మహిళలను అవమానించాయని, రాజధాని ప్రాంతంపై విషపూరిత ప్రచారంగా అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. . టీడీపీ నాయకత్వం, ప్రజలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. చట్టపరమైన చర్యలను డిమాండ్ చేశారు. ఈ వివాదం అమరావతి రాజధాని అంశాన్ని మరింత రాజకీయంగా సున్నితమైన అంశంగా మార్చింది,. 

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎన్నుకున్నారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ నిర్ణయం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుకున్న రైతులు, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది, దీనితో 2019-2024 మధ్య అమరావతి ఉద్యమం జరిగింది. గత ఎన్నికల్లో అమరావతి రాజధాని నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘన విజయం సాధించింది.  అయితే వైసీపీ మాత్రం  అమరావతిని పరోక్షంగా వ్యతిరేకిస్తోంది.

ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయగా..  అసుల వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయనను వైసీపీ నేతుల దాచి పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆయన ఆజ్ఞాతంలో ఉండి తన వాదన సమర్థించుకుంటున్నారు. ఎక్కడో రెయిడింగ్ జరిగితే  .. అది అందరికీ వర్తింపు చేస్తూ.. తాను చెప్పింది కరెక్టేనని వాదిస్తున్నారు.కానీ పోలీసులకు అందుబాటులోకి రావడం లేదు.  ఆయనను కూడా అరెస్టు చేసి ... జాతీయ మహిళా కమిషన్ ను నివేదిక పంపనున్నారు. ఇప్పటికే కొమ్మినేని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.                   

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget