అన్వేషించండి

Nara Lokesh: టీచర్ల సలహాలతోనే పాఠశాలల్లో సంస్కరణలు - నారా లోకేష్ వినూత్న కార్యక్రమం

Andhra Teacher: ఆదర్శ ఉపాధ్యాయుల సూచనలతో విద్యా సంస్కరణలు చేపట్టాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. ‘షైనింగ్ టీచర్’ కల్యాణి నుంచి పలు అంశాలను తెలుసుకున్నారు.


Nara Lokesh As Student:  ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని  విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామన్నారు.   కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తి పట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు. 

పాఠశాల రూపు రేఖల్ని మార్చిన టీచర్ కల్యాణి
  
2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కల్యాణి తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారు. తాను బాధ్యతలు చేపట్టేనాటికి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా అందులో ఇద్దరు మాత్రమే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేవారు. ఒకానొక దశలో పాఠశాలను మూసివేయాలని భావించారు. ఉపాధ్యాయురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నిధులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు పాఠశాలలో మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేశారు. తన పనితీరుతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించారు. దీంతో 2020-21 విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 53 కి పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు చేరడం ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారిలో 23 మంది విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం పొందగా, ఒకరికి ప్రతిష్టాత్మక నవోదయ పాఠశాలలో ప్రవేశం లభించింది. ప్రస్తుతం పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారు.

 విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి 

షైనింగ్ టీచర్ తో సమావేశం సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యశాఖ మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయురాలి నుంచి ఎంతో హుందాగా సలహాలు సూచనలు స్వీకరించారు. వాటిని ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. పట్టుదలతో స్కూల్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. సింగిల్ టీచర్ గా ఉండి పెద్దసంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావడం చరిత్ర అని ప్రశంసించారు. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కల్యాణి మాట్లాడుతూ.. నా వద్ద చదువుకునే విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఆశయంతో పనిచేశాను. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య లభిస్తుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి. స్టార్ ఆప్ ది వీక్ పేరుతో ప్రతి సోమవారం హోం వర్క్, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత యూనిఫాంలో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేస్తాను. వారి ప్రోగ్రెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తాను. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ పేరుతో విద్యార్థుల పుట్టినరోజు నాడు వ్యక్తిగత పరిశుభ్రత తెలియజేసేలా టీచర్ కు సబ్బు ప్రదానం చేసే సంస్కృతి తీసుకువచ్చాం. పేద విద్యార్థులు  చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ‘మా తొలి అడుగు’ పేరుతో వారికి అవసరమైన పలక, బలపం, పెన్నులు, నోట్ పుస్తకాలు అందజేస్తాం. ఎవరైనా స్కూల్ కు సెలవు పెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. నేను సెలవు పెట్టాలన్నా అనుమతి తీసుకుంటాను. పిల్లలు బాగా చదవకపోతే తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడతాను. ప్రతి రోజూ హోంవర్క్ ఇస్తాను. చిన్న పిల్లలకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఫోటోల ప్రదర్శన ద్వారా వారిలో చదువు పట్ల ఆసక్తి కలిగిస్తానని వివరించారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనంగా మరో టీచర్ ను కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

టీచర్ సూచనలు అమలు చేస్తామన్న లోకేష్

ప్రస్తుతం రాష్ట్రంలో 9,600 పాఠశాలలకు తరగతికో ఉపాధ్యాయుడు ఉన్నారు. భవిష్యత్ లో మరింత మెరుగుపరుస్తాం. విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. స్టార్ ఆఫ్ ది వీక్ ఆలోచన బాగుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటికే మెగా పీటీఎం నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నాం. నిజానికి ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. ఇక్కడే క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. పట్టుదల ఉంటుంది. విద్యార్థులకు వర్క్ బుక్స్, రాజ్యాంగంపై చిన్నవయసులోనే అవగాహన కలిగించేలా చర్యలు తీసుకున్నాం. ముందు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు దృష్టిసారిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలియాలి. డీఎస్సీ పై 30 కేసులు వేశారు. అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. సమాజంలోనూ మార్పురావాలని, విద్య ద్వారానే ఉన్నతస్థాయికి వెళ్తామన్నారు. ఇకపై ఉత్తమ ఉపాధ్యాయులను కలిసి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
Modi Shah Jagan Appointment: జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget