అన్వేషించండి

Naga Babu: వైసీపీ డీఎన్ఏలోనే హింస, ఆరోజు మరింతగా ఉద్రిక్తతలు జరుగుతాయి - నాగబాబు

AP Latest News: ఏపీలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై నాగబాబు స్పందించారు. వైసీపీ డీఎన్ఏలోనే హింస ఉందని ఎద్దేవా చేశారు. పోలింగ్ రోజు మరింత హింస జరుగుతుందని అన్నారు.

Janasena News: ఏపీలో ప్రజలు అందరూ చాలా తెలివితో ఓట్లు వేశారని.. అందుకే పోలింగ్ శాతం ఏకంగా 81.86 శాతం నమోదైందని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. వైసీపీ పోలింగ్ ప్రక్రియకు ఎన్నో ఆటంకాలు కలిగించిందని.. బెదిరింపులకు పాల్పడిందని అన్నారు. దాడులకు పాల్పడ్డా ఓటర్లు వెనకడుగు వేయకుండా ఓట్లు వేశారని అన్నారు. ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనే విషయం వైసీపీ వారికి అర్థం అయిపోయిందని నాగబాబు అన్నారు. అందుకే ఎన్నికలు ముగిశాక కూడా ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారని నాగబాబు బుధవారం (మే 15) సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఓటర్లపై వైసీపీ కక్షకట్టినట్లుగా ఉందని.. పోలింగ్ అనంతరం కూడా  ప్రజలను వేధిస్తున్నారని నాగబాబు అన్నారు. వైసీపీ డీఎన్ఏలోనే హింస అనేది ఉందని మరోసారి రుజువు అవుతూందని అన్నారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడడం వైసీపీ హింసకు పరాకాష్ఠగా మారిందని అన్నారు. అదే విధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూటమి అభ్యర్థి అఖిలప్రియ గన్ మెన్ పై దాడికి దిగారని అన్నారు. తాడిపత్రిలో అశాంతి రేపారని.. పోలింగ్ రోజున రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ఏజెంట్లను అపహరించి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. శ్రీ నక్కల సుబ్రహ్మణ్యం కంటికి తీవ్రగాయం అయిన విషయాన్ని నాగబాబు ప్రస్తావించారు.

ఈవీఎంలు దాచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పెంచాలి - నాగబాబు
అలాగే ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పెంచాలని అన్నారు. హింసకు పాల్పడ్డ వైసీపీ వాళ్లే ఎన్నికల సంఘాన్ని పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని అన్నారు. పోలింగ్ అనంతరం హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

‘‘హింసకు పాల్పడ్డ వైసీపీ వాళ్ళే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉంది. దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉంది. పోలింగ్ అనంతరం హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలి. జూన్ 4 న వచ్చే ప్రజా తీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉంది. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వైసీపీకి ఓటమి తప్పదు... అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనం’’ అని నాగబాబు అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget