News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Botsa : ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !

విజయనగరం జిల్లా ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలను అణాపైసలతో సహా చెల్లిస్తామని రైతులకు మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఆందోళనల వెనుక టీడీపీ ఉందని ఆరోపించారు.

FOLLOW US: 
Share:


విజయనగరం జిల్లాలో మూడు రోజులుగా చెరుకు రైతుల ఆందోళన ఉద్రిక్తలకు కారణం అవుతోంది. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేశారు. అయితే రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రైతులు కూడా తిరగబడటం చర్చనీయాంశమయింది.ఈ క్రమంలో రైతులపైనా కేసులు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేశారు.  వివాదం అంతకంతకూ పెద్దది అవుతూండటంతో విజయనగరం జిల్లాకే చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Also Read : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?

చక్కెర ఫ్యాక్టరీ బకాయి ఉన్న రైతులకు అణా పైసలతో సహా చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 80 వేల ఎకరాల్లో సాగుచేసిన చెరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు చెల్లించాల్సింది కేవలం రూ.6 కోట్లేనని బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల ఆందోళనల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని ఆరోపించారు. చక్కెర నిల్వలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రైతుల బకాయిల చెల్లింపు చేసిన తర్వాతనే మిగిలిన మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించాలని గత సమావేశాల్లో నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం అమలు కాలేదు.  ఎందుకు చెల్లించలేదో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

Also Read: CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?

బొత్స సత్యనారాయణ రూ. 9కోట్లు మాత్రమే  చెల్లించాలని చెబుతున్నారు కానీ.. గత రెండేళ్లుగా కంపెనీలు చెల్లింపులు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార యాజమాన్యం తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు క్రషింగ్‌ సీజన్‌లకు సంబంధించిన రూ.16.33 కోట్ల బకాయిలను ఎన్‌సీఎస్‌ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సి ఉందంటున్నారు.  మంత్రులు కూడా ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కనిపించకపోవడంతో రోడ్డెక్కారు.  

Also Read : సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్

రెండేళ్ల నుంచి బకాయిలు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోలేదని ప్రభుత్వంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. గతంలో హామీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. మంత్రి బొత్స అణాపైసా సహా ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ.. ఎప్పట్లో చెప్పడం లేదని.. రైతుల ఉద్యమాన్ని అణిచి వేసేందుకు అరెస్టులు చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 

Also Read : పెట్రో రేటు తగ్గింపు సరే.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

Published at : 05 Nov 2021 03:10 PM (IST) Tags: ANDHRA PRADESH minister botsa vijayanagaram NCS Sugars Farmers' Dharna

ఇవి కూడా చూడండి

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు