By: ABP Desam | Updated at : 04 Nov 2021 09:17 AM (IST)
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేసంపై సీఎం సమీక్ష
ఈనెల 14న తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో అమిత్షా భేటీ కానున్నారు. ఈ వేదికపైనే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీలపై గట్టిగా అడగాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. రాష్ట్ర విభజన అంశాన్ని మరోసారి లైమ్లైట్లోకీ తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన హామీలతోపాటు పెండింగ్ అంశాలు, బకాయిలు గురించి ప్రస్తావించాలని సూచించారు.
సదరన్ కౌన్సిల్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. విభజజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను అజెండాలో ఉంచాలన్నారు. రూ. 6,300 కోట్ల విద్యుత్ బకాయిలు,ు రెవెన్యూబ లోటు, రేషన్ బియ్యం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిలు, పోలవరం రీయింబర్స్మెంట్ బకాయిలు, ఎఫ్డీ ఖాతాల సమస్య, ఆస్తుల విభజనలో పెండింగ్ ఉన్న అంశాలను ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలన్నారు సీఎం జగన్.
ALSO READ: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ
నధుల అనుసంధానం అంశాన్ని కూడా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలన్నారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రెడీగా ఉండాలని ఆధికారులకు చెప్పారు. ఈ భేటీలో వేరే రాష్ట్రాల ప్రస్తావించే అంశాల్లో ఏపీకి రిలేటెడ్ ఉంటే తగిన రీతిలో రియాక్ట్ కావాలన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్మమంత్రులు, పుదుచ్చేరీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు పాల్గొంటారు. ఏపీ నుంచి మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ఇతర అధికారులు పాల్గొంటారు.
ALSO READ: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల
ALSO READ: ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు.. నలుగురు మృతి
ALSO READ: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి
YSRCP Plenary: "కిక్ బాబు అవుట్" ఇదే వైఎస్ఎస్ఆర్సీపీ ప్లీనరీ నినాదం
No Responce On ABV : ఒంటరి ఏబీవీ - ఐపీఎస్ సంఘాలూ మాట సాయం చేయట్లేదు !
AB Venkateswara Rao: దుర్మార్గుడి పాలనలో పనిచేసే కంటే అడవిలో వ్యవసాయం మేలు : ఏబీవీ సంచలన వ్యాఖ్యలు
AP Deputy CM: సీఎంపై మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, జగన్ను అంతమాట అనేశారే!
YSRCP Nominated Posts: వైఎస్సార్సీపీలో పదవుల పండుగ - పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షులు వీరే
Sravana Bhargavi Reacts On Divorce: విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
In Pics: వీణా వాణితో మంత్రులు సబిత, సత్యవతి - స్వీట్లు తినిపించి అభినందనలు, ఈ అద్దం సంగతి ఏంటో తెలుసా?
TS Inter Results: ఆ విద్యార్థులను చూస్తే గుండె తరుక్కుపోతోంది, అలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి
Udaipur Murder Case: ఉదయ్పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు