By: ABP Desam | Updated at : 04 Nov 2021 04:15 PM (IST)
ఒడిశాకు సీఎం జగన్(ఫైల్ ఫొటో)
సీఎం జగన్ ఒడిశా వెళ్లనున్నారు. జలవివాదాల పరిష్కారం కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చిస్తారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న జల జగడం పరిష్కారం కోసం చర్చలు జరుపనున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో చర్చలు చేస్తారని తెలుస్తోంది. అదే రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే.. నేరెడి బ్యారేజీ నిర్మాణంపైనా చర్చ జరుగుతుంది. చర్చల కోసం సమయం ఇస్తే రావడానికి సిద్ధమని.. ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. లేఖపై నవీన్ పట్నాయక్ స్పందించారు. చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తూ.. జగన్ ను ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయాలంటే ఒడిశా, చత్తీస్ఘడ్లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ పరిస్ధితుల్లో నీటిని నిల్వ చేసేందుకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో వైఎస్ జగన్ చర్చలు జరపనున్నారు.
గతంలో రాసిన లేఖలో జగన్ ఏం ప్రస్తావించారంటే..
వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో సీఎం జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చని గతంలో రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు.
Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..
Also Read: Weather Updates: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ
Business Reforms Action Plan 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ టాప్ - విమర్శలు తిప్పికొట్టేందుకు దొరికింది ఛాన్స్
Tenali News : తెనాలి సబ్ రిజిస్టర్ కు మొదటి రోజే షాక్, విద్యుత్ అధికారులు ఎంత పనిచేశారు?
BJP On Dharmavaram: ధర్మవరం దాడి ఘటనపై బీజేపీ సీరియస్- కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఈజ్ ఆఫ్ డూయింగ్లో మళ్లీ ఏపీనే నెంబర్ 1
Dharmavaram News : ప్రజాస్వామ్యమా, పాలేగాళ్ల రాజ్యమా?, ఎమ్మెల్యే కేతిరెడ్డిపై గోనుగుంట్ల ఫైర్
Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!
PAN Aadhaar Linking: నేడే ఈ పని చేయండి! లేదంటే రూ.1000 ఫైన్ కట్టండి!!
Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి
Rohit Sharma: ఎడ్జ్బాస్టన్కు రోహిత్ రెడీనా? రాహుల్ ద్రవిడ్ కామెంట్స్!!