News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 9న ఒడిశా వెళ్లనున్నారు. జల వివాదాల పరిష్కారంపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో సమీక్ష నిర్వహించున్నారు.

FOLLOW US: 
Share:

సీఎం జగన్ ఒడిశా వెళ్లనున్నారు. జలవివాదాల పరిష్కారం కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్​తో చర్చిస్తారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న జల జగడం పరిష్కారం కోసం చర్చలు జరుపనున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో చర్చలు చేస్తారని తెలుస్తోంది. అదే రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే.. నేరెడి బ్యారేజీ నిర్మాణంపైనా చర్చ జరుగుతుంది. చర్చల కోసం సమయం ఇస్తే రావడానికి సిద్ధమని.. ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్​కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. లేఖపై నవీన్ పట్నాయక్ స్పందించారు. చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తూ.. జగన్ ను ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయాలంటే ఒడిశా, చత్తీస్​ఘడ్​లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ పరిస్ధితుల్లో నీటిని నిల్వ చేసేందుకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో వైఎస్ జగన్ చర్చలు జరపనున్నారు.

గతంలో రాసిన లేఖలో జగన్ ఏం ప్రస్తావించారంటే..

వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో సీఎం జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ధి  చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చని గతంలో రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. 

Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..

Also Read: CM Jagan: సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్

Also Read: Weather Updates: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ

Also Read: Petrol-Diesel Price, 4 November: గుడ్‌న్యూస్.. కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుదల

 

Published at : 04 Nov 2021 04:12 PM (IST) Tags: cm jagan odisha cm naveen patnaik water disputers between ap and odisha cm jagan tour in odisha neradi barrage

ఇవి కూడా చూడండి

Andhra News :  సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !

Andhra News : సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !

APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్‌, విజయనగరంలో అకౌంటెంట్/ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్‌, విజయనగరంలో అకౌంటెంట్/ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

Top Headlines Today: విశాఖ నుంచే పోటీ చేస్తానన్న లక్ష్మీనారాయణ! తెలంగాణలో ఆలయాలకు క్యూ కట్టిన నేతలు

Top Headlines Today: విశాఖ నుంచే  పోటీ చేస్తానన్న లక్ష్మీనారాయణ! తెలంగాణలో ఆలయాలకు క్యూ కట్టిన నేతలు

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

Deadlines in December: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

Deadlines in December: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

టాప్ స్టోరీస్

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు