అన్వేషించండి

Mansas Trust: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించినా పర్లేదు...కానీ

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతి రాజు ప్రకటించారు.

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా ఎలాంటి అభ్యంతరం లేదని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు తెలిపారు. అయితే ట్రస్టు ఆనవాయితీలను పాటించాలని సూచించారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా మహిళలనే తీసుకుంటే అభ్యంతరం ఏముంటుదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదన్నారు. రాజకీయాలతో లేనటువంటి ట్రస్టుపై ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి రాగానే మాన్సాస్ ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని అశోక్ గజపతిరాజు అన్నారు. తనను జైలుకు పంపిస్తానని అంటున్నారని, బెయిల్‌పై వచ్చిన వారికి జైలు అంటే ఇష్టమై ఇలా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. 

ఈవో వైఖరి మారలేదు 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు వ్యతిరేకం కాదని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. కానీ ట్రస్టు ఆనవాయితీ కొనసాగించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 800 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు ఆరోపిస్తున్నారన్నారు. వైసీపీ పెద్దలు భూములపై పడి సర్వేలు చేస్తున్నారన్నారు. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు వైఖరి కూడా మారలేదని అశోక్ గజపతి రాజు అన్నారు. 

Also Read: Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు: చిరు.. నాగ్.. రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్, టీఆర్పీ అదుర్స్!

టీడీపీ నేతల అరెస్టులు ఎందుకు?

మాన్సాస్‌ ట్రస్ట్‌ విద్యార్థులకు బోధనా ఫీజులు ఇవ్వడంలేదని అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు.  ట్రస్టు వ్యవహారంతో సంబంధంలేని టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. సింహాచలానికి చెందిన 800 ఎకరాలు మాయమైనట్లు వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారని, భూములపై సర్వే చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అశోక్ గజపతి రాజు అన్నారు. వైసీపీ పెద్దలు భూములపై పడ్డారని, అందుకే సర్వేలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదికలో నిలదీశామన్నారు. 

ప్రజల ఆస్తి

మాన్సాస్‌ ప్రైవేటు ఆస్తి కాదని ప్రజల ఆస్తి అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలుసుకోవాలని మాన్సాస్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ నిర్వహణ సక్రమంగా లేనందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. సింహాచలం భూములు 800 ఎకరాలు మాయమయ్యాయని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారని, అధికారంలో ఉన్నందున సర్వే నంబర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. 

 

Also Read: నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ పెద్దలు భేటీ.. నాగార్జున హాజరు డౌటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Embed widget