అన్వేషించండి

East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో పులి కలకలం, సీసీ కెమెరాలో రికార్డ్ - ప్రజలకు డీఎఫ్‌ఓ జాగ్రత్తలు

Cheetah in East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాజమండ్రి నగర శివారులో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Leopard in East Godavari : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అటవీ ప్రాంత పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతం వైపు చిరుత ఓ నల్లని జంతువుపై దాడి చేసి దివాన్ చెరువు నేషనల్ హైవే పై రోడ్డు దాటడాన్ని వాహనదారులు గమనించారు. చిరుత సంచారంపై స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు వెంటనే స్పందించి ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించారు.

అటవీ పరిసరాల్లోనే సంచారం
  జిల్లా ఇంఛార్జ్ డీఎఫ్ఓ భరణి మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులి కదలికలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. పులి కదలికలు తెలుసుకునేందుకు 36 ట్రాప్ కెమెరాలు అమర్చామని.. ఆదివారం ఉదయం ఐదు గంటలకు రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్నట్లు రికార్డయ్యాయని తెలిపారు. అత్యధిక జన సంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోనే చిరుత పులి సంచరిస్తోందన్నారు. దానిని తిరిగి అడవిలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బోన్ల సాయంతో బంధిస్తామని.. అందుకోసం రెండు బోన్లు కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. అటవీ సమీపంలోని ప్రజలు ఎవరూ కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట తిరగవద్దని సూచించారు. 

నిపుణుల బృందాలు ఏర్పాటు
అటవీ ప్రాంతంలో కొన్ని కెమెరాలను ఏర్పాటు చేయడంతో పులిని పట్టుకునేందుకు నిపుణుల బృందాలు గాలిస్తున్నాయని   జిల్లా ఇంఛార్జ్ డీఎఫ్ఓ భరణి తెలిపారు. వీటితో పాటు థర్మల్‌ డ్రోన్‌ కెమెరాలను కూడా ఉపయోగించి శోధిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల కెమెరాలలో కనిపించిన దృశ్యాల ఆధారంగా అది దివాన్‌ చెరువు రిజర్వ్‌ ఫారెస్టులోనే ఉందని, దాని పాద ముద్రలు గుర్తించామన్నారు. అయితే ఇంత వరకూ దాని వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. అలాగే పులి సంచారంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.


వెంటాడుతున్న భయం
రాజమండ్రి శివారులోని దివాన్‌చెరువు ప్రాంత ప్రజలను చిరుతపులి భయం వెంటాడుతోంది. గత పది రోజులుగా చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అది చిక్కక దొరకక ముప్పు తిప్పలు పెడుతుంది. అధికారులు బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ అది అందులో చిక్కడం లేదు. దివాన్‌చెరువు ప్రాంతానికి ఆనుకుని అటవీశాఖకు చెందిన 950 ఎకరాల అటవీభూముల్లో చిరుత సంచరిస్తూ రాత్రివేళల్లో అది జనావాసాల చెంతకు వస్తోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు థర్మల్‌ డ్రోన్లును ప్రయోగిస్తున్నా అడవిలో దట్టంగా ఉన్న పొదల కారణంగా చిరుత డ్రోన్లుకు సైతం చిక్కడం లేదు. అయితే ట్రాప్‌ కెమెరాలో మాత్రం రెండుసార్లు రికార్డు అయ్యింది.. దీంతో చిరుత పులి దివాన్‌చెరువు ప్రాంతానికి ఆనుకుని ఉన్న అడవిలోనే ఉందని ఫారెస్ట్‌ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  

సీతాఫలాలకు నెలవు
రాజమండ్రి దివాన్‌ చెరువు అనగానే సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతాయని చాలా మందికి తెలుసు.. దివాన్‌చెరువు ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూముల్లో చాలా మంది రైతులు సీతాఫలాల్ని పండిస్తుంటారు. పైగా ఇది సీజన్‌ కావడం వల్ల రైతులు, కూలీలు అంతా పొలాల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే గత పదిరోజులుగా చిరుతపులి ఈప్రాంతంలోనే సంచరిస్తుందని తెలియడంతో ఇక్కడి రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లలేకపోతున్నామని, పులి భయంతో సీతాఫలాలు కోసేందుకు కూలీలు రావడంలేదని వాపోతున్నారు. మొత్తం మీద చిరుతపులి భయంతో తమకు నష్టం వాటిల్లుతోందంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget