అన్వేషించండి

27 వరకు గడువు ఇవ్వండి- సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ

తన అమ్మ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురై కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు అవినాష్ రెడ్డి. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.

వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపమలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున 27వ తేదీ వరకు విచారణకు గడువు ఇవ్వాలని కోరారు. 

తన అమ్మ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురై కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు అవినాష్ రెడ్డి. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు బ్లడ్‌ ప్రెషర్‌తోపాటు హైపర్‌ టెన్షన్‌ ఇబ్బందులు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. తన నాన్ని భాస్కరరెడ్డి కూడా రిమాండ్ ఖైదీగా ఇదే కేసులో  జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. తల్లిదండ్రుల బాగోగుల చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ పరిస్థితిలో అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని వివరించారు. 

వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ తన తల్లి కోలుకోవడం లేదని ఇప్పటికే ఓసారి గుండెపోటు కూడా వచ్చిందన్నారు అవినాష్. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారని లేఖలో వివరించారు. యాంజియోగ్రామ్‌ టెస్టు చేస్తే గుండెలో రెండు చోట్ల బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. ఆమెను మరికొన్ని రోజులు ఐసీయూలో చికిత్స అందిస్తారని వివరించారు. 

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు అవినాష్ రెడ్డి. ఈ పరిస్థితుల దృష్ట్యా తనకు గడువు ఇవ్వాలని సీబీఐకి రిక్వస్ట్ పెట్టుకున్నారు. 

తాను 27 వ తేదీ వరకు గడువు కోవాలని కోరారు. పరిస్థితి 27 నుంచి తాను విచారణకు అందుబాటులోకి వస్తానని పేర్కొన్నారు. తన లేఖతోపాటు తల్లి ఆరోగ్యంపై వైద్యుల ఇచ్చిన రిపోర్టులను కూడా జతపరిచారు. ఉదయం కూడా ఆయన ఓ లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ ఏడు రోజుల గడువు కోరారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని జత చేస్తూ మరో లేఖ రాశారు. 

ఉదయం లక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఉదయం వైద్యులు ఓ బులెటిన్ విడుదల చేశారు. ఆమెకు బీపీ తక్కువ ఉందని తెలిపారు. ఏం తినలేకపోతున్నారని... వాంతులు అవుతున్నాయని పేర్కొన్నారు. మెదడుకు, పొట్టకు ఆల్ట్రాసౌండ్‌ చేయాల్సి ఉందని వివరించారు. ఇంకొన్ని రోజులు చికిత్స చేయాల్సి ఉందని బులెటిన్‌లో తెలిపారు. 

కర్నూలులో ఉదయం నుంచి హైడ్రామా 

కర్నూలులో ఉదయం నుంచే హైడ్రామా నడుస్తోంది. ఉదయాన్నే కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్టు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దానికి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ ఎదుట బైఠాయించారు అవినాష్ రెడ్డి అనుచరులు. హాస్పిటల్ ముందే పెద్ద ఎత్తున బైఠాయించి బయటవారు రాకుండా అడ్డుకుంటున్నారు. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి దగ్గరకు చేరుకొని అరెస్టు చేస్తారా లేక అవినాష్ రెడ్డిని ఎస్పీ ఆఫీసుకు పిలిపించి విచారణ చేపడతారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Also Read:26న అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, మంచి జరిగి ఉంటే మద్దతివ్వండి: జగన్

Also Read:  వైసీపీ ఎమ్మెల్యేలను పొగడటంపై కేశినేని నాని సీరియస్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Ramya Krishnan : తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
Christmas 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
Embed widget