అన్వేషించండి

Kurnool Parliament Constituency : కర్నూలు పార్లమెంటులో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా... లేక టీడీపీ పట్టు సాధిస్తుందా? 

Kurnool Parliament Constituency: ఆ పార్లమెంటు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. అలాంటి నియోజకవర్గంలో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు ఎత్తులకు పైఎత్తుల వేస్తున్నాయి.

Andhra Pradesh News: రాయలసీమ ముఖద్వారం కర్నూలు. లోక్ సభ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి(Kotla Vijayabhaskar Reddy) ఆయన తనయుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి(Kotla Jayasurya Prakash Reddy) కేంద్ర పదవులు చేపట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అలాగే అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి  అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్య(Damodaram Sanjeevayya) కూడా ఇక్కడి వారే. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పునర్విభజన జరగక ముందు 6 అసెంబ్లీలో స్థానాల్లో ఉండేది. పునర్విభజన తర్వాత కొత్తగా మంత్రాలయం నియోజకవర్గం (Mantralayam Assembly constituency)రావడంతో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. వాటిలో ఒకటి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ మిగిలిన ఆరు నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. 

1952 నుంచి ఎన్నికలు 

కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి కర్నూలు అసెంబ్లీతోపాటు కోడుమూరు(Kodumuru), పత్తికొండ, ఎమ్మిగనూర్(Emmiganoor), ఆలూరు(Alur), ఆదోని(Adoni), మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. 1952లో మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి పార్లమెంటు సభ్యుడు సీతారామిరెడ్డి. భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1952 నుంచి మొత్తం 18 లోక్‌సభ ఎన్నికలు జరుగ్గా 12 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టిడిపి, 2 సార్లు వైస్సార్సీపీ, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 

ఇలా గెలిచిన వారిలో సమీప ప్రత్యర్డైన సోమప్పపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 1,99,356 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అభ్యర్థిగా ఎన్నికై మొదటిసారే కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 10వ సారి 1991 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఎస్వీ సుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రిగా అవకాశం రావడంతో లోక్ సభకు రాజీనామా చేశారు. 15వసారి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కే కృష్ణమూర్తిపై కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ల జయసూప్రకాశ్ రెడ్డి గెలుపొంది 15వ లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో మరోసారి గెలిచిన సూర్య ప్రకాష్ రెడ్డి రైల్వే సహాయ శాఖ మంత్రి పదవి చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన రెండు దఫా ఎన్నికల్లో  వైఎస్ఆర్సీపీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఓటర్లలో చైతన్యం ఎక్కువ, పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోను పోలింగ్ శాతం పెరుగుతూనే ఉంది. 2009లో 62.48 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014లో 71.21 శాతానికి చేరి 2019లో 79.65% పోలింగ్ జరిగింది. దీనిని బట్టి ప్రతిసారి జరిగిన ఎన్నికల్లో కూడా కొత్త ఓటర్లు నమోదు అవడం.. ఆ కొత్త ఓటర్లు అంతే చురుకుగా ఓటింగ్‌లో పాల్గొనడం జరుగుతోంది. 

త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ముందు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వైసీపీ ప్రకటించింది. ఆయన పోటీ నుంచి తప్పుకని టీడీపీలో చేరడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు కార్పొరేషన్ మేయర్ బీవై రామయ్య వైసీపీ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. 

ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి మాత్రం తన అభ్యర్థి ప్రకటన విషయంలో అచి తూచి అడుగులు వేస్తోంది. ముందుగా అందరూ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం ఎంపీగా బరిలోకి దింపుతుందని అందరూ భావించినా, ఎవరు ఊహించని విధంగా ఆయనను డోన్ నుంచి పోటీకి దింపుతున్నారు. టిడిపి,జనసేన,బిజెపి కూటమి అభ్యర్థిగా ఎవరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ టికెట్ ఆశిస్తున్న వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. ఆయనకు సీటు ఖాయమనే టాక్ నడుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget