అన్వేషించండి

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్ కో పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

CM Jagan Nandyal Tour: సుపరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని.. పారిశ్రామికాభివృద్ధికి చేయూత ఇస్తున్నామని జగన్ తెలిపారు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పరిశ్రమలో 1000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణ అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

'మూడోసారీ మనమే నంబర్ వన్'

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా 3వ సారి మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఈ ఘనత సాధ్యం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనలో ఉన్న ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ సర్కారు అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని, రైతులకు మంచి జరగడంతోపాటు ఉద్యోగవకాశాలు వస్తాయని, రానున్న 4 ఏళ్లలో 20 వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని సీఎం జగన్ తెలిపారు. "ఈ సారి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తే ఎకరాకు ఏడాదికి రూ. 30వేల లీజు చెల్లిస్తాం. మూడేళ్లకు ఒకసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలి. గ్రోత్ రేటులో దేశంలో ఏపీ నంబర్ వన్ గా ఉంది. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి" అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

పరిశ్రమల స్థాపనకు సర్కారు ప్రోత్సాహం

ఏపీ సర్కారు అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు తమ పరిశ్రమలను పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జయజ్యోతి, జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండగా.. తాజాగా కల్వటాల వద్ద రూ. 1,790 కోట్లతో రామ్ కో పరిశ్రమను నెలకొల్పింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సర్కారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. దీంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. 

ప్రస్తుతం రామ్ కో ఏర్పాటు చేసిన కంపెనీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుండి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ కో తన పరిశ్రమ ఏర్పాటును వేగవంతం చేసింది. పనులు త్వరిగతన పూర్తి చేసి పరిశ్రమను ప్రారంభించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget