అన్వేషించండి

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్ కో పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

CM Jagan Nandyal Tour: సుపరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని.. పారిశ్రామికాభివృద్ధికి చేయూత ఇస్తున్నామని జగన్ తెలిపారు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పరిశ్రమలో 1000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణ అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

'మూడోసారీ మనమే నంబర్ వన్'

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా 3వ సారి మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఈ ఘనత సాధ్యం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనలో ఉన్న ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ సర్కారు అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని, రైతులకు మంచి జరగడంతోపాటు ఉద్యోగవకాశాలు వస్తాయని, రానున్న 4 ఏళ్లలో 20 వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని సీఎం జగన్ తెలిపారు. "ఈ సారి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తే ఎకరాకు ఏడాదికి రూ. 30వేల లీజు చెల్లిస్తాం. మూడేళ్లకు ఒకసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలి. గ్రోత్ రేటులో దేశంలో ఏపీ నంబర్ వన్ గా ఉంది. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి" అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

పరిశ్రమల స్థాపనకు సర్కారు ప్రోత్సాహం

ఏపీ సర్కారు అందిస్తున్న సహకారంతో పలు కంపెనీలు తమ పరిశ్రమలను పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జయజ్యోతి, జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండగా.. తాజాగా కల్వటాల వద్ద రూ. 1,790 కోట్లతో రామ్ కో పరిశ్రమను నెలకొల్పింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయి. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సర్కారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. దీంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. 

ప్రస్తుతం రామ్ కో ఏర్పాటు చేసిన కంపెనీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుండి దశల వారీగా 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. 2018 డిసెంబర్ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ కో తన పరిశ్రమ ఏర్పాటును వేగవంతం చేసింది. పనులు త్వరిగతన పూర్తి చేసి పరిశ్రమను ప్రారంభించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget