అన్వేషించండి

AP SSC Exam: పదో తరగతి ఎగ్జామ్ పేపర్ లీక్‌పై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన- వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరిక

పదోతరగతి పరీక్ష ప్రారంభమైన తొలి రోజే అధికారులకు షాక్ ఇచ్చారు కొందరు వ్యక్తులు, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నా పత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో గందరగోళం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకైందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. లీక్‌ వదంతులపై విద్యాశాఖ ఓ వివరణ ఇచ్చింది. పేపర్ లీక్ ప్రసక్తే లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్ తెలిపారు. ఉదయం 9.30కి పరీక్ష ప్రారంభమైతే 11 గంటలకు సోషల్ మీడియాలో ప్రశ్నాపత్నం సర్క్యులేట్ అయిందని వివరణ ఇచ్చారు. అందుకే దీన్ని లీక్‌ అనడానికి అవకాశమే లేదన్నారు. 

కొందరు ఉద్దేశపూరకంగానే లీక్ చేసినట్టు తెలుస్తోందన్న సురేష్‌ కుమార్...వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశ్నాపత్రం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె స్కూల్‌ నుంచి లీక్ అయినట్టు గుర్తించామన్నారు సురేష్. పేపర్ లీక్ చేసిన వారితోపాటు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపర్‌వైజర్‌, ఇన్విజిలేటర్‌పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 

పదో తరగతి ప్రశ్నా పత్నం లీక్ చేసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. లీక్‌ల సమస్యల్లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని సూచించారు. ఉదయం పరీక్ష ప్రారంభమైన కాసేపటికే లీక్‌ల వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. నంద్యాలతోపాటు చిత్తూరు జిల్లాలో కూడా పేపర్ లీక్ అయినట్టు ప్రచారం జరిగింది. 

చిత్తూరులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ గ్రూపులో తెలుగు ప్రశ్నా పత్రాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఉలిక్కి పడ్డ అధికార యంత్రాంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ స్పందించారు. చిత్తూరు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులు చక్కగా పరీక్ష రాస్తున్నారని, పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని డీఈఓకు సమాచారం అందిన  మేరకు డీఈఓ జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేశారని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎవరూ వదంతులు నమ్మవద్దని చిత్తూరి జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrabau : చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 అదుర్స్ - పూర్తి డీటైల్స్ ఇవిగో
చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 అదుర్స్ - పూర్తి డీటైల్స్ ఇవిగో
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP DesamLeopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP DesamSunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABPSunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrabau : చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 అదుర్స్ - పూర్తి డీటైల్స్ ఇవిగో
చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 అదుర్స్ - పూర్తి డీటైల్స్ ఇవిగో
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
RC16: రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Embed widget