అన్వేషించండి

భార్యపై అనుమానం - పిల్లల్ని కాలువలోకి తోసిన తండ్రి!

ఓ వైపు మద్యం మత్తు, మరోవైపు భార్యపై అనుమాం, కోపంతో ఆటోలో తీసుకెళ్లి మధ్యలో దాడి చేశాడు. ఆమెను ఓ చోట పడేసి ఆటోతో సహా పిల్లలిద్దరినీ కాలువలోకి తోసేశాడు. 

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలను అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడో తండ్రి. ఓ వైపు మద్యం మత్తు మరో వైపు భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చిన్నారులు రాత్రంతా చలికి వణికిపోతూ.. రోడ్డుమీదే ఉండిపోయారు. భార్య మీద కోపంతో పిల్లలను ఎందుకలా వదిలేసిన ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న కృష్ణ, సుజాతకు ఐదుగురు సంతానం. వారిలో ఒక కుమార్తె కాగా.. నలుగురు కుమారులు. ఈ క్రమంలోనే వీరిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇవి చాలవన్నట్లు కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ఎప్పుడైతే మద్యానికి బానిస అయ్యాడో అప్పటి నుంచి భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు.

పిల్లలతో సహా ఆటోను కాల్వలోకి తోసిన తండ్రి..

ప్రతిరోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టి నిద్రపోయేవాడు. అయితే సోమవారం రాత్రి కూడా కృష్ణ ఫుల్లుగా తాగొచ్చాడు. మద్యం మత్తులో ఊగుతూనే భార్యతో గొడవ పడ్డాడు. మూడేళ్ల కుమారుడు బండు, ఐదేళ్ల తనయుడు మహేంద్రతో సహా భార్యను ఆటోలో ఎక్కించుకొని ఊరికి దూరంగా వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక భార్యను ఆటోలోంచి దింపేసి ఆమెపై మరోసారి దాడి చేశాడు. అయితే సుజాత స్పృహ తప్పి పడిపోవడంతో.. అక్కడే వదిలేసి పిల్లలు ఉన్న ఆటోను తీస్కొని వెళ్లిపోయాడు. కొంతదూరం వెళ్లాకా.. ప్యాలకుర్తిలోని దిగువ కాల్వ గట్టులోకి పిల్లలు ఉన్న ఆటోను తోసేసి అతను పారిపోయాడు. కాలువ గట్టున ఆటో ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. భయపడి ఆటోలోంచి దిగిపోయిన చిన్నారులిద్దరూ రోడ్డుపైకి వచ్చి ఏడవడం ప్రారంభించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులో చలిలో వణికిపోతూనే ఉదయం వరచు వేచి చూశారు.

పిల్లలు తల్లి గురించి చెప్పడంతో.. ఆమెను కూడా కాపాడిన పోలీసులు!

అయితే పొలం పనుల కోసం వేకువజామునే అటుగా వచ్చిన రైతు లక్ష్మీ నారాయణ.. ఆ పిల్లల ఏడుపు విని వారి దగ్గరకు వెళ్లాడు. కాసేపు వారిని బుజ్జగించి.. పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన హైవే పోలీసులు.. చిన్నారులను చేరదీశారు. పిల్లలు తమ తల్లి గురించి చెప్పగా పోలీసులు వెళ్లి రక్షించారు. మంగళవారం కృష్ణను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి.. పిల్లలను వారికి అప్పగించారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న బాలల సంరక్షణ నిర్వాహకులు చిన్నారులను చేరదీసేందుకు ముందుకు వచ్చారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మానవ సంబంధాలు మంట కలుస్తున్న వేళ..

నెల్లూరు జిల్లా కావలి పట్టణం గాయత్రి నగర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సీఐఎస్ఎఫ్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన కోటేశ్వరరావు ఆస్తి కోసం కన్నతల్లిని కిడ్నాప్ చేశాడు. విశ్రాంతి ఏఎస్సై చేసిన ఘనకార్యం ఇదే మొదటిది కాదు. అంతకు ముందు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించాడు. ఆస్తి కోసం పలు మార్లు కన్న తల్లినే తీవ్రంగా కొట్టిన చరిత్ర కోటేశ్వర రావుది. కోటేశ్వర రావు తల్లి పేరు మహా లక్ష్మమ్మ. ఆమె వయస్సు 85 ఏళ్లు. గతంలో కోటేశ్వర రావు ఆస్తి కోసం తల్లి మహా లక్ష్మమ్మపై దాడికి పాల్పడ్డాడు. కన్న తల్లి అని కూడా చూడకుండా, వృద్ధురాలు అనే దయ లేకుండా నీచంగా ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె తన కూతురు వద్దకు వచ్చి తల దాచుకుంటోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget