అన్వేషించండి

Kurnool News: ఆమె కళ్లు మరో వందేళ్లు ఈ ప్రపంచాన్ని చూస్తాయి- నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపిన చరిత

30 ఏళ్ల మహిళ ఆదర్శంగా నిలిచారు. తాను చనిపోతూ చరిత్రలో నిలిచిపోయారు. కన్నీరును పంటి బిగువున ఉంచుకొని ఆ ఫ్యామిలీ చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు.

కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లో అర్థరాత్రి వైద్యుల హడావుడి... ఆస్పత్రిలోని సిబ్బంది అంతా ఉరుకులు పరుగులతో శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 మంది వైద్యుల బృందం ఆసుపత్రికి చేరుకుంది. భారీగా పోలీసుల మోహరింపు. కర్నూలు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్‌లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్లకు ఏ అడ్డంకి లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులకు, ఆసుపత్రిలోని రోగుల బంధువులకు ఈ హఠాత్పరిణామాలు అర్థం కావడం లేదు. కనిపించిన వైద్య సిబ్బందిని ఏం జరుగుతుంది అంటూ అడిగే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అంతలోనే ఆపరేషన్ థియేటర్లో ధరించే దుస్తులతో మాస్క్‌తో ఓ వైద్యుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే అందరూ ఆయన చుట్టూ చేరి ఏం జరుగుతోందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మూతికున్న మాస్కు మెల్లగా తీసేస్తూ ఆ వైద్యుడు తన చుట్టూ చేరిన వారికి పరిస్థితిని వివరించడం మొదలుపెట్టారు. 

ఓ 30 ఏళ్ల యువతి తన అవయవాలను దానమిచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి ప్రాణదాతగా మారిందంటూ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళ కళ్ళు చెమర్చాయి. ఊపిరితిత్తులు, గుండె, కళ్ళు, కిడ్నీలు, లివర్ తదితర అన్ని అవయవాలను వాటి అవసరం ఉన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉన్న  రోగులకు అమర్చేందుకు సమాయత్తం అవుతున్నట్లు వైద్యుడు చెప్పారు. అవయవాల దాత చరితకు అందరూ ధన్యవాదాలు తెలిపి ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకున్నారు. 

తెలంగాణలోని గద్వాల్‌కు చెందిన 30 సంవత్సరాల చరిత గత నెలలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. కాన్పు అయిన 10 రోజుల తర్వాత ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది. అపస్మారకస్థితికి చేరుకుంది. స్థానికంగా వైద్య చికిత్సలు అందించిన అనంతరం కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మెదడు అచేతనంగా ఉందని బంధువులకి చెప్పడంతో ఆమె బంధువులు వైద్యనిపుణుల సలహా మేరకు జీవనదారా స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి అవయవాలు దానం చేయడానికి అంగీకారం తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య బృందం శస్త్ర చికిత్సలకు సమాయత్తమైంది. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. 

ఏకంగా 40 మంది వైద్య బృందం ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు. స్థానిక డిఎస్పి తన సిబ్బందితో ట్రాఫిక్ ని క్లియర్ చేయించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నిర్ణీత సమయాలలో అవయవాలు గమ్యస్థానాలకు చర్చించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం అవయవదాత చరితకు పలు రకాల పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం భారీగా తరలివచ్చిన జనాల మధ్య ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పేరుకు తగ్గట్టే చరిత చరిత్రలో నిలిచిపోతుందని, ఆమె త్యాగం ఎన్నో కుటుంబాలలో వెలుగుల నింపిందని అందరూ కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ఆమె కుటుంబ సభ్యులు సైతం అవయవధానానికి సంసిద్ధత వ్యక్తం చేయడం ప్రశంసనీయమంటూ వైద్యులు, పోలీసులు ప్రశంసించారు. గుంటూరు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి ఊపిరితిత్తులను, నెల్లూరు అపోలో ఆసుపత్రికి ఒక కిడ్నీని , మరొక కిడ్నీ కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోనే కిడ్నీ మార్పిడి చేశారు. కర్నూలులో ఇలాంటి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగడం మొదటిసారి కావడం గమనార్హం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget