అన్వేషించండి

AP Vs Odissa : అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

కొఠియా గ్రామాల్లోకి ఏపీ అధికారులు రాకుండా ఒరిస్సా అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. ఆ గ్రామాలు తమవేనని ఒరిస్సా అంటోంది. కానీ తమవని ఏపీ వాదిస్తోంది.


ఆంధ్రప్రదేశ్ - ఒరిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో సోమవారం ఏర్పడిన ఉద్రిక్తత అందర్నీ ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణం కొద్ది రోజుల కిందట అస్సాం- మిజోరం రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలే. నిజానికి ఆ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం లాంటిదే ఏపీ - ఒరిస్సా మధ్య ఉంది. ఆ సమస్యే కొఠియా గ్రామాలు. 

అస్సాం - మిజోరం సరిహద్దు వివాదం తరహాలోనే ఏపీ- ఒరిస్సా మధ్య కొఠియా గ్రామాల సమస్య..!

అస్సాం - మిజోరం రాష్ట్రాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ వివాదానికి కారణం సరిహద్దు. 1972 వరకు అస్సాంలో మిజోరం ఒక భాగం.  విడిపోయిన తర్వాత రెండురాష్ట్రాల మధ్య 165 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కానీ అస్సాంలోని కొంత భాగం తమదని మిజోరం వాదిస్తుంది. కాదు మిజోరంలో కొంత భాగం తమదని అస్సాం వాదస్తోంది. దీంతో సరిహద్దు వివాదం అంతకంతకూ పెరిగిపోయింది. చివరికి అది ఘర్షణలకు దారి తీసింది. ఇప్పుడు అంత తీవ్రంగా కాకపోయినా అలాంటి పరిస్థితులు భవిష్యత్‌లో ఏర్పడటానికి పునాదులు ఆంధ్రప్రదేశ్ - ఒడిషా సరిహద్దుల్లో ఏర్పడ్డాయి. గ్రామాల్లో బారీకేడ్లను ఏర్పాటుచేయడం.. అధికారుల్ని .. ప్రజాప్రతినిధుల్ని వెనక్కి పంపేశారు. దీంతో వివాదం ముదిరింది. AP Vs Odissa : అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

ఏపీ అధికారులు అడుగు పెట్టకుండా కంచెలు నిర్మించిన ఒరిస్సా ప్రభుత్వం..!

ఒడిషా ఇలా సరిహద్దుల్లో గ్రామాల్లో ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగు పెట్టకుండా చేసింది కొఠియా గ్రామాల్లో. ఆ కొఠియా గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంది. కానీ శాంతిభద్రతల పేరుతో ఒరిస్సా బలగాలను రంగంలోకి దించింది. బారికేడ్లను ఏర్పాటు చేసి రహదారి మూసివేసింది.  రెండు గ్రామాలను ఒరిస్సా పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు.  ఆ గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. అధికారులు బలగాలే కాదు...  ఒరిస్సాకు చెందిన రాజకీయ పార్టీలకు చెంది నేతలు కూడా ఆ గ్రామాలకు వచ్చారు. ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొఠియా గ్రామాలు ఒడిశా మట్టి అడుగు పెడితే ఒప్పుకోబోమని హెచ్చరికలు జారీ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నార. ఏపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొఠియాను వదులుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. ఒడిషా దూకుడు చూసి ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడ చేపట్టాలనుకున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలను వాయిదా వేసింది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా గొడవలు జరికాయి. పోలింగ్ నిర్వహించేందుకు ఒడిషా అధికారులు అంగీకరించలేదు. అప్పుడు కూడా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. 

సుప్రీంకోర్టు, పార్లమెంట్ కూడా పరిష్కరించలేకపోయిన సమస్య..! 

ఆంధ్రప్రదేశ్ - ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న  విజయనగరం జిల్లా - కోరాపుట్‌ జిల్లాల మధ్య 21 గ్రామాలను కొఠియా గ్రామాలకు పిలుస్తారు. సాలూరు నుంచి 40 కి.మీ.ల మేర అడవులు, కొండల్లో ప్రయాణిస్తే కొఠియా గ్రామాలు కనిపిస్తాయి. అక్కడికి రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామాల్లో జనాభా దాదాపు 15 వేల మంది నివసిస్తూ ఉంటారు. ఈ గ్రామాలు ఎవరివనేదానిపై ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాల మధ్య సుదీర్ఘ కాలం వివాదం ఉంది. కొఠియా పరిధిలోని 21 గ్రామాలు మావని పోరాడుతూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. 1968లో ఒరిస్సా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య జఠిలం నడుస్తునే ఉంది. 2006లో మాత్రం సుప్రీం కోర్టు రెండు రాష్ట్రాలూ సమన్వయంతో ముందుకు సాగాలని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.  కానీ ఎలాంటి చర్చలు రెండురాష్ట్రాల మధ్య జరగలేదు. ప్రస్తుతం వివాదం సుప్రీం కోర్టులో ఉన్నట్లే. 


AP Vs Odissa : అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

అక్కడ అందరూ రెండు రాష్ట్రాల పౌరులే..! 

రెండురాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం.. పథకాలు అందించడం వంటివి చేస్తున్నాయి.  తాము ఒడిశాకు చెందుతామా లేక ఆంధ్రాకు చెందుతామా అన్నది అక్కడున్న వారికి సైతం స్పష్టత లేకుండా పోతోంది. రెండు  రాష్ట్రాలు ఇచ్చే సాయాన్ని వారు తీసుకుంటున్నారు. కొఠియా గ్రామాలపై ఒరిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌  ప్రత్యేకంగా దృష్టిసారించారు. భారీగా నిధులు కేటాయించారు. ఆ గ్రామాలు తమవేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నా అక్కడ తెలుగు బోర్డులే కనిపించవు. ఒరిస్సా ప్రభుత్వ బోర్డులు..  భవనాలు కనిపిస్తూ ఉంటాయి. కొఠియా ప్రాంతంలో భారీ ఎత్తున్న అభివృద్ధి పనులు అక్కడి ప్రభుత్వం చేపడుతూ వస్తోంది. ఆ స్థాయిలో ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదు. ఇటీవలి కాలంలో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.  ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇదే జిల్లాకు చెందినా ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఇటీవల అక్కడ పర్యటించి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒరిస్సా అదికారులు, నేతలు అడ్డుకుంటున్నారు. అదే సమయంలో ఒరిస్సాకుచెందిన  అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, విపక్ష నేతలు, ఉన్నతాధికారులు క్యూకట్టారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. నిత్యం సభలు, సమావేశాలతో హడావుడి చేస్తున్నారు. దీంతో అ గ్రామాలు ఒరిస్సావేనన్న అభిప్రాయం బలపడేలా పరిస్థితి మారుతుంది. 

కొఠియా ప్రాంతంలో అపారమైన సంపద

ఆ కొఠియా గ్రామాల కోసం రెండు ప్రభుత్వాలు పోరాడటానికి కారణం ఉంది. కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది.  మాంగనీస్‌, బాక్సైట్‌ తదితర గనులున్నాయి. అద్భుతమైన ప్రకృతి సౌంతర్యం ఉంటుంది. చిన్న చిన్న విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రవాహాలు ఉంటాయి. అందుకే ఒరిస్సా ప్రభుత్వం ఈ గ్రామాలపై దృష్టి పెట్టిందని ఏపీ వైపు నుంచి ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఒడిషా ప్రజాప్రతినిధులు కూడా అదే చెబుతూంటారు. కారణం ఏదైనా రెండురాష్ట్రాల ప్రభుత్వాలు కొఠియా గ్రామాలు తమవంటే తమవని వాదిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని చెబుతున్నాయి. ఈ సమస్యను తీర్చాల్సిన పార్లమెంట్.. అసలు ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. 


AP Vs Odissa : అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

ఇలాగే పట్టుదలలకు పోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం..! 

దేశంలో సరిహద్దు సమస్యలు పెరుగుతున్నాయి. అవి ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నా రాను రాను ఉద్రిక్తతలకు కారణం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అస్సాం - మిజోరం ఉదందమే చక్కని సాక్ష్యం. దేశంలో అనేక రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. మహారాష్ట్ర - కర్ణాటక మధ్య ఉన్నాయి.  ఏపీ - తెలంగాణ మధ్య ఏడు మండలాలపై అప్పుడప్పుడూ వివాదం రేగుతూనే ఉంటుంది. ఇవన్నీ చాలా వరకూ పరిష్కారమైన సమస్యలు లేదా... చర్చలతో పరిష్కారమయ్యే సరిహద్దు సమస్యలే. అయితే రాజకీయం కోసం మాత్రమే తెరపైకి తెస్తూ ఉండటం వల్ల ఆ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి.  వీటికి తెరపడితే దేశంలో అంతర్గత ఇబ్బందులు .. రాష్ట్రాల మధ్య గొడవలు చాలా వరకూ తగ్గిపోతాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget