అన్వేషించండి

Flood Affect: ఇప్పటికీ జలదిగ్బంధంలోనే కోనసీమ, వరద నీటిలో ప్రజల పాట్లు!

Flood Affect: కోనసీమ ప్రాంతమంతా ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉంది. వరద నీటిలోనే ఉంటూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Flood Affect:  రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతాలలో వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టిన కోనసీమలో మాత్రం ఇంకా వరద కష్టాలు తీర లేదు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఇంకా ముంపు ముప్పులోనే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తమకు తాగేందుకు సరైన నీళ్లు, భోజనం దొరకడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు తాగేందుకు పాలు కూడా దొరకడం లేదంటూ వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. కరకట్టలు కూడా ఎక్కడపడితే అక్కడ బలహీన పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణాన  ఏ ఏటిగట్టు కూలిపోతుందో అంటూ భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. 

వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలన చేశారు. శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. వరద ప్రభావిత గ్రామాలలో విష సర్పాల బెడద తీవ్రంగా కనిపిస్తుంది.  మరోపక్క వ్యాధుల బెడద కూడా అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కోనసీమలో వరద  కష్టాలు తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో వరద బాధితులకు సాయం అందించాలి..

వరద గ్రామాలలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.వీ.వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు సందర్శించారు. నీళ్లలోనే ఇంటింటా తిరుగుతూ వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపై కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని అయితే ప్రభుత్వం చేస్తున్న సాయం అరకొరగా ఉంటున్నాయని తెలిపారు. పూర్తి స్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పుగాకులంకలో ఎమ్మెల్సీ పర్యటన..

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వరద ప్రభావిత గ్రామాల్లో కేవలం కొంత దూరమే వెళ్లి పరామర్శించి వస్తున్నారని... సాయం అందించడంలో కూడా శివారు ప్రాంతాలలో ఉన్న వారికి సాయం సరిగా అందడం లేదని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు అన్నారు. వరదల్లో నీట మునిగిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం ప్రభుత్వం నుంచి అందించాలని వారు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం పుగాకులంకలో వరద బాధితులతో మాట్లాడారు.

ఎక్కడ చూసినా వరద బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో వారికి నాణ్యమైన భోజనం, మంచి నీళ్లు, చిన్న పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను తీర్చాలని.. ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పంట కొనుగోళ్లపై సీఎం రేవంత్ మాట తప్పారు: కేటీఆర్
పంట కొనుగోళ్లపై సీఎం రేవంత్ మాట తప్పారు: కేటీఆర్
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
IRCTC Booking: ఇండియన్ రైల్వేస్ జ్ఞాపకాల ప్రయాణం.. పట్టాలపై సాగే ప్రయాణం భావోద్వేగాల హరివిల్లు
ఇండియన్ రైల్వేస్ జ్ఞాపకాల ప్రయాణం.. పట్టాలపై సాగే ప్రయాణం భావోద్వేగాల హరివిల్లు
NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
Breaking News:పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
Embed widget