అన్వేషించండి

Kakani Govardhan Reddy bail: అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ - అన్ని కేసుల్లోనూ రిలీఫ్ - ఇక విడుదలే

Kakani Bail: కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆయన విడుదల కానున్నారు.

Kakani Govardhan Reddy has been granted bail:  మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిది. పొదలకూరు మండలం తాటిపర్తిలో రుస్తుం మైన్స్‌లో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని A4గా చేర్చారు. ఈ కేసులో చాలా కాలం పరారీలో ఉన్న ఆయనను కేరళలో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు  నిరాకరించడంతో ఆయన జైలుకు వెళ్లక తప్పలేదు.

తాటిపర్తిలో రుస్తుం మైన్స్‌లో అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు జరిగాయని, లీజు సమయం ముగిసిన తర్వాత కూడా 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్‌ను తరలించారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 16, 2025న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.   ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో కూడా కాకాణికి బెయిల్ మంజూరైంది. ఇక కృష్ణపట్నం పోర్టు వద్దఅనధికార టోల్‌గేట్ ఏర్పాటు చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది.   తహసీల్దారు డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది.  

నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలలో పేలుడు పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారని ఆరోపణలపై కేసు నమోదైంది.  వెంకటాచలం సీఐ సుబ్బారావు,  ఆర్‌ఐ రవిని బెదిరించారని, కేసు విచారణను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలతో వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో 2024 డిసెంబర్ 27న కేసు నమోదైంది. ఈ కేసు కాకాణి అనుచరుడు మందల వెంకట శేషయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంబంధం కలిగి ఉంది. కాకాణి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.  

అలాగే కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో 2025 జనవరి 22న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సందర్భంలో కాకాణి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకుడు వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై IPC సెక్షన్లు 224, 351/2, 352, 353/2 కింద కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.  2025 మే 25న  అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ అన్ని కేసుల్లోనూ ఆయన బెయిల్తెచ్చుకున్నారు.  ఆగస్టు 18న, చివరి కేసు అయిన అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, దీంతో ఆయన అన్ని కేసులలో బెయిల్ పొందారు. ఇప్పుడు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.                  

కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించారు.                    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
Telangana Janasena: తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
Andhra Manamitra: ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
Ghaziabad Suicide Case:
"కొరియన్ లవర్‌" గేమ్‌కు బానిసలై ముగ్గురు బాలికల ఆత్మహత్య! మరో బ్లూవేల్‌లా మారుతుందని ఆందోళన!

వీడియోలు

CM Mamata Banerjee SIR Supreme Court | SIR పై పోరాడేందుకు సుప్రీంలో గళం విప్పిన మమత | ABP Desam
RCB vs Delhi Capitals WPL 2026 Final | ఫైనల్ కు చేరిన ఢిల్లీ
Anil Kumble about Gambhir Coaching | గంభీర్ టీమ్ పై కుంబ్లే వ్యాఖ్యలు
Chennai Super Kings in WPL | WPLలో సీఎస్కే ఎంట్రీ
T20 World Cup 2026 Ind vs Pak | ఐసీసీలో ఒంటరిగా మిగిలిన పాక్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
Telangana Janasena: తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
Andhra Manamitra: ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
Ghaziabad Suicide Case:
"కొరియన్ లవర్‌" గేమ్‌కు బానిసలై ముగ్గురు బాలికల ఆత్మహత్య! మరో బ్లూవేల్‌లా మారుతుందని ఆందోళన!
AP High Court: తెనాలిలో నిందితులను రోడ్లపై నడిపించటంపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ 4 వారాలకు వాయిదా
తెనాలిలో నిందితులను రోడ్లపై నడిపించటంపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ 4 వారాలకు వాయిదా
Maremma Teaser : హీరోగా రవితేజ సోదరుడి తనయుడు - ఆ ఊరికి అమ్మోరి శాపమా!... 'మారెమ్మ' టీజర్ చూశారా?
హీరోగా రవితేజ సోదరుడి తనయుడు - ఆ ఊరికి అమ్మోరి శాపమా!... 'మారెమ్మ' టీజర్ చూశారా?
Telangana Municipal Elections: మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ తరపున అగ్రనేతలు - బీఆర్ఎస్ లైట్-ఎందుకలా?
మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ తరపున అగ్రనేతలు - బీఆర్ఎస్ లైట్-ఎందుకలా?
Gaddafi Murder: లిబియాలో గడాఫీ కొడుకు దారుణ హత్య - అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కాల్చి చంపిన దుండగులు
లిబియాలో గడాఫీ కొడుకు దారుణ హత్య - అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కాల్చి చంపిన దుండగులు
Embed widget