అన్వేషించండి

Ananta TDP : అనంతపురం టీడీపీలో చిచ్చు .. తోటి నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ !

అనంతపురం టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సారి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోకుండా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.


అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఉన్న గ్రూపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టుల అంశంపై టీడీపీ నేతలు రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.  రాయలసీమకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారని ప్రకటించారు. అయితే ఈ సమావేశంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలంతా ఇప్పుడు సదస్సులంటూ బయలుదేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రాజెక్టుల సదస్సులేమిటన్న జేసీ ప్రభాకర్ !

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెండేళ్ల నుంచి ఏ ఒక్క నేతా పట్టించుకోలేదని.. ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా అని ప్రశ్నించారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు సదస్సులు పెట్టాలి కానీ.. నీటి ప్రాజెక్టుల పేరుపై కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల కనుసన్నల్లో సదస్సు జరుగుతోందని వారికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నారా లోకేష్ నర్సరావుపేట పర్యటనకు వెళ్తూంటే పోలీసులు అడ్డుకున్నారని కానీ అనంతపురంలో మాత్రం ప్రాజెక్టుల సదస్సంటే ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు కాబట్టే అనుమతించారని ఆరోపించారు. 

టీడీపీ నేతలు పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆగ్రహం ! 

 అనంతపురం జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే తాము నాయకులమయ్యామని .. కానీ ఆ కార్యకర్తలకు ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా అండగా లేరని ఆరోపించారు. కార్యకర్తల కోసం మీటింగ్ లో పెట్టాలి గాని ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగేనని జేసీ ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.  ఈ ప్రాజెక్టులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పోరాడాయి ఏమన్నా ఫలితం ఉందా అని ప్రశ్నించారు.  అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట.. కానీ ఇతర నాయకులు దీనిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఇద్దరు నేతలు టీడీపీని నాశనం చేస్తున్నారని జేసీ ప్రభాకర్ విమర్శలు

గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెల్చుకున్న ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి మాత్రమే. కార్యకర్తలను పట్టించుకుంటే అనేక చోట్ల టీడీపీ గెలుపొందేదని కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. అందరూ కేసులకు  భయపడుతున్నారని ఆయన అంటున్నారు. ఇప్పుడు అదే కారణంగా సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా విరుచుకుపడటానికి కారణాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కేసులకు భయపడి పెద్దగా పోరాడటం లేదని.. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో జిల్లాలోని ఇతర టీడీపీ నేతలతో ఆయనకు సరిపడటం లేదు. ఈ కారణంగానే ఆయన సదస్సుపై మండిపడినట్లుగా తెలుస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget