అన్వేషించండి

YS Jagan : ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పోరాటం - హైకోర్టులో పిటిషన్

Andhra Pradesh : ప్రతిపక్ష నేత హోదా ఇప్పించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ ను ఆదేశించాలని కోరారు.

Jagan Fights For Leader of Opposition Status :  ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తానే ప్రతిపక్ష నాయకుడ్నని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో స్పీకర్ కు లేఖ రాశారు. తాజాగా ఆ హోదా ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఆయనను వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే గుర్తించారు. దీంతో వెంటనే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‍ ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‍లో జగన్ పేర్కొన్నారు. 

ఏపీలో అధికార పార్టీ కాకుండా ఉన్న మరో పార్టీ తమదేనని  జగన్ చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ  విరుద్ధమని వాదిస్తున్నారు. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో పది శాతం సీట్లు ఉంటేనే  ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదని జగన్ ఇంతకు ముందు స్పీకర్‌కు లేఖ రాశారు. మామూలుగా అయితే పది శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. రెండు, మూడు పార్టీలకు పది శాతం కన్నా ఎక్కువ సీట్లు వస్తే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తిస్తారు. కానీ ఏపీలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది. కనీసం పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఇలా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను అడగాల్సి వచ్చేది కాదు. 

కానీ స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలని జగన్ అడుగుతున్నారంటేనే.. నిబంధనల ప్రకారం ఆయనకు రావాల్సిన సీట్లు రాలేదని అర్థం అవుతుందని.. అలాంటి రూల్ లేనప్పుడు అడగాల్సిన అవసరం ఏముందని ..  ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నేత హోదా వస్తుంది కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత 2014, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పది శాతం సీట్లు రాలేదు. అందుకే ఆ పార్టీ పక్ష నేతను ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గానే పార్లమెంట్ లో ఆ పార్టీ నేత వ్యవహరించారు.                         

తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని  గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన తీర్పు రాలేదు. స్పీకర్ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశం లేదని న్యాయనిపుణలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోర్టు ఆదేశించినా.. స్పీకర్ పాటించాల్సిన అవసరం లేదని.. శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదని అంటున్నారు. ముఖ్యంగా సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేరని చెబుతున్నారు. మొత్తంగా జగన్పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
Vijayawada వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
Raj Tarun Case: హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
CM Revanth Reddy: 'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీపీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
Vijayawada వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
వరద బాధితులకు వైసీపీ మరో సాయం - పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
Raj Tarun Case: హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
హైదరాబాద్‌ టు ముంబై- రాజ్‌తరుణ్‌ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలో మరో ట్విస్ట్ 
CM Revanth Reddy: 'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
'రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం' - నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సవరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
Andhra Pradesh: కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి నలుగుర్ని చంపేసిన తెనాలి మహిళలు- కర్రీ అండ్‌ సైనైడ్ కు సీక్వెల్‌గా ఉందీ స్టోరీ
కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి నలుగుర్ని చంపేసిన తెనాలి మహిళలు- కర్రీ అండ్‌ సైనైడ్ కు సీక్వెల్‌గా ఉందీ స్టోరీ
Devara Davoodi Song: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ
ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ
Vinayaka Chavithi Rangoli : వినాయక చవితి స్పెషల్ రంగోలి.. ఇలాంటి ముగ్గులు వేసి గణేషుడిని ఇంటికి పిలిచేయండి
వినాయక చవితి స్పెషల్ రంగోలి.. ఇలాంటి ముగ్గులు వేసి గణేషుడిని ఇంటికి పిలిచేయండి
Bigg Boss Tasty Teja: 'టేస్టీ' తేజకు మెయిన్ లీడ్ రోల్... 'జబర్దస్త్', 'బిగ్ బాస్' నుంచి ఇప్పుడు సినిమాల్లోకి
'టేస్టీ' తేజకు మెయిన్ లీడ్ రోల్... 'జబర్దస్త్', 'బిగ్ బాస్' నుంచి ఇప్పుడు సినిమాల్లోకి
Embed widget