అన్వేషించండి

Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య

Begum Bazar Crime News: ఆర్థిక కష్టాలతో నిన్న తాండూరులో ఓ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే ఇవాళ బేగం బజార్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన మరింత దారుణంగా ఉంది.

Telangana Crime News: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండు దారుణాలు కలకలం రేపాయి.  తాండూరులో ఓ వ్యక్తి బేగంబజారులో మరో వ్యక్తి కుటుంబాన్ని దారుణంగా హతమార్చారు. కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన వ్యక్తులే ఇలా చంపడం తర్వాత ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చి బేగంబజారులో స్థిరపడిన సిరాజ్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని హతమార్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని చంపుతున్నప్పుడు చూసిన పెద్ద కుమారుడు భయంతో తప్పించుకొని పారిపోయాడు. తెల్లవారుజామున కత్తితో సిరాజ్‌ తన భర్య కొంతు కోసి చంపేశాడు. తర్వాత చిన్న కుమారుడు గొంతు నులిమి హతమార్చాడు. ఈ రెండుహత్యలు చూసిన పెద్దకుమారుడు భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సూసైడ్ నోట్ చేసిన సిరాజ్ తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

సూసైడ్ నోట్‌లో ఏముందో పోలీసులు చూస్తున్నారు. పెద్దకుమారుడిని విచారిస్తున్నారు. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే వేరే సమస్యలు ఉన్నాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన కాసేపటికి ఘటనాస్థలానికి పోలీసులు, క్లూస్ టీంలు చేరుకున్నాయి. ఆధారాలు సేకరిస్తున్నాయి.  

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయి అప్పులు- కుటుంబమంతా సూసైడ్‌

24 గంటల క్రితం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన వ్యక్తి కుటుంబాన్నే మృత్యువుకు బలి ఇచ్చాడు. కాసిపేటకు చెందిన శివప్రసాద్‌ సోషల్ మీడియాలో చూసి స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. సరైన అవగాహన లేకపోవడంతో అప్పులు పాలు అయ్యాడు. దొరికిన చోటల్లా  అప్పులు చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులతో పురుగుల మందు తాగేశాడు. 

పాతికేళ్ల శివప్రసాద్ తన తల్లిదండ్రులు, అక్కకు పురుగుల మందు తాగించాడు. అక్క దివ్యాంగురాలు. తాము పోయిన తర్వాత ఆమెను ఎవరు చూసుకుంటారని ఆమెకి కూడా పురుగుల మందు ఇచ్చాడు. వీళ్లంతా వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ఒక కుటుంబమంతా చనిపోవడం కాసిపేటలో తీవ్ర విషాదం నెలకొంది. 

ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్‌- వివాహిత సూసైడ్‌

కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటనాగలక్ష్మి ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకుంది. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగలక్ష్మికి ఐదు నెలల క్రితమే ప్రకాశం జిల్లా ముసునూరు మండలం తోచిలుకకు చెందిన మనోజ్‌తో వివాహమైంది. ఆయన కాంట్రాక్టర్‌గా ఉన్నారు. దంపతుల మధ్య ఉన్న విభేదాలు కారణంగానే నాగలక్ష్మి సూసైడ్ చేసుకున్నట్టు ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ముందుగానే నిర్ణయించుకున్న నాగలక్ష్మి విష పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుందన్నారు. 

బుధవారం రాత్రి విషం తాగిన సంగతి తెలుసుకున్న నాగలక్ష్మి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 24 గంటల పాటు శ్రమించినా వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. దీంతో మనోజ్‌ వేధింపులతోనే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య- కలకలం రేపుతున్న సూసైడ్‌లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget