అన్వేషించండి

Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !

Look Back 2024 Telangana: తెలంగాణ 2024లోకి ఓ రాజకీయ సంచలనంతో అడుగు పెట్టింది. అదే 2024లోనూ కంటిన్యూ అయింది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా హ్యాపీగా లేదు.

All political parties in Telangana unhappy  Lookback 2024 : అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏడాది సాధారణంగా సాదాసీదాగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు అలసిపోయి ఉంటాయి. పెద్దగా రాజకీయం చేయకుండా సైలెంట్ గా ఉంటాయి.అయితే తెలంగాణ రాజకీయ పార్టీలకు మాత్రం అలాంటి అవకాశం లేదు. ఖర్చుకు ఖర్చు ..అలసట తప్పలేదు. 2023లో చివరిలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డిన పార్టీలు సహజంగా 2024లో రిలాక్స్ కావాల్సింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరికీ విశ్రాంతి లేకపోయింది. ఆ తర్వాత కూడా రాజకీయ పార్టీలు ఏ మాత్రం విశ్రమిచండం లేదు. ఓ రకంగా చూస్తే తెలంగాణ  రాజకీయ పార్టీలు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పుడే పరుగు పందెం ప్రారంభించాయి. అది కూడా హైస్పీడ్‌తో అందుకే. ఈ ఏడాది జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. 

పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయిన బీఆర్ఎస్ 

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోవడం ఈ ఏడాది జరిగిన రాజకీయ పరిణామాల్లో అత్యంత కీలకమైనది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ కారణంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పార్టీగానే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు చాలా ప్రయత్నించారు. కేసీఆర్ విస్తృతంగా బస్సు యాత్ర ద్వారా పర్యటించారు. పదహారు స్తానాలు  గెలుస్తామని గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ ఒక్క సీటు కూడా  గెల్చుకోలేదు సరి కదా సగం స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఈ పరిణామం ఏ మాత్రం ఊహించనిది. కాంగ్రెస్ ఎనిమిది, బీజేపీ ఎనిమిది సీట్లు గెల్చుకోగా.. మజ్లిస్ తన హైదరాబాద్ కంచుకోటను నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా దారుణంగా పడిపోయింది. అది బీజేపీకి ట్రాన్స్ ఫర్ అయింది. అప్పట్నుంచి కేటీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు పార్టీని నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది చివరిలో కవిత యాక్టివ్ అయ్యారు. 

అత్యధిక కష్టాలు బీఆర్ఎస్ పార్టీకే

పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన పార్టీకి 2023 చివరిలో గడ్డు పరిస్థితి తీసుకు వస్తే 2024లో ఇంకా మరిన్ని బాధలు తెచ్చి పెట్టాయి. ఒక్క లోక్ సభ సీటును గెల్చుకోలేకపోవడంతో పాటు పార్టీ అధినేత కుమార్తె కవిత అరెస్టు, విడుదల వ్యవహారాలు ఇబ్బంది పెట్టాయి. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కవిత జైల్లో ఉన్నప్పటికీ ప్రజలు సానుభూతి చూపలేదు. ఆ తర్వాత పార్టీ నేతలు వరుసగా జంప్ కొట్టడం ప్రారంభించారు. ఇప్పటికే పార్టీ తరపున గెలిచిన పది మంది పార్టీ మారిపోయారు. వారిపై అనర్హతా వేటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసుల వల విసురుతున్న నసూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది  కేటీఆర్ , హరీష్ రావు  ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు. అదే ఆ పార్టీకి కాస్త రిలీఫ్ ఇస్తోంది . పార్టీ క్యాడర్ నమ్మకం కోల్పోకుండా చూసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. 

కాంగ్రెస్‌కు పర్వాలేదనే ఏడాది - కానీ అసంతృప్తే !

2023 చివరిలో సంచలన  విజయంతో కొత్త ఏడాదిలోకి అధికార పార్టీగా అడుగు పెట్టిన కాంగ్రెస్ 2024లో తిరుగులేని స్థానానికి చేరుకుంటామని అనుకుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు నుంచి పదిహేను గెల్చుకుంటామని అనుకున్నారు. హైకమాండ్ కు కూడా అదే చెప్పారు. రేవంత్ రెడ్డి పదిహేను సీట్లు గెల్చుకోవాలన్న పట్టుదలతో పని చేశారు. బలమైన నేతల్ని ఏ పార్టీలో ఉన్నా చేర్చుకున్నారు. పదిహేను సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఈ పాటికి కీలక నేతగా మారి ఉండేవారు. కానీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడంతో మంత్రి వర్గ విస్తరణకు అనుమతి తెచ్చుకోవడానికే తంటాలు పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం బీఆర్ఎస్ ముప్పేట దాడి  చేస్తోంది . కేసీఆర్ తెరపైకి రానప్పటికీ కేటీఆర్, హరీష్ రావు మాత్రం ప్రతి విషయంలోనూ ప్రభుత్వంపై మీడియా, సోషల్ మీడియా సాయంతో దాడి చేస్త పరుగులు పెట్టిస్తున్నారు. బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాది చివరిలో సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందనేది భవిష్యత్‌లో తెలుస్తుంది. ఈ ఏడాది కాంగ్రెస్ కు అంత గొప్పగా లేదు.. అలాగని తీసి పారేసేలా లేదు. అలా జరిగిపోయింది అంతే అనుకోవచ్చు. 

పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు - అయినా స్తబ్దుగా బీజేపీ

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. కానీ ఆ పార్టీ ఈ ఏడాది మొత్తం నీరసంగానే ఉంది. తాము ప్రతిపక్షంలా గట్టిగా పోరాడలేకపోయామని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ స్వయంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీకి కిషన్ రెడ్డి తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కేంద్రమంత్రిగా బిజీగా ఉంటున్నారు. తెలంగాణలో కొత్త అధ్యక్షుడ్ని నియమించలేదు. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఫలితంగా బీజేపీ పరిస్థితి చుక్కాని లేని నావలా సాగిపోతోంది. అసెంబ్లీ సమవేశాల్లోనూ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగ వ్యవహరిస్తున్నారు. 2025లో అయినా తమ జాతకం మారుతుందని బీజేపీ క్యాడర్ కోరుకుంటోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget