అన్వేషించండి

Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !

Lookback 2024 : బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించలేకపోయింది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ ఆ పార్టీ వైభవం ఒక్క శాతం తగ్గలేదు. చంద్రబాబు కొత్త స్టార్ గా అవతరించారు.

Lookback 2024 BJP is continuing with the same momentum: 2024 ఏడాది రాజకీయ పార్టీలన్నింటికీ ఓ కీలక సంవత్సరం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సాయంతో బీజేపీని గట్టి దెబ్బకొట్టేందుకు ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన చూపించినప్పటికీ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆపలేపోయింది. తాము ముందుగు రాలేకపోయింది. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదాను గత పదేళ్లుగా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం అది సాధ్యమయింది. అదొక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరట. 

కొనసాగుతున్న బీజేపీ హవా 

2014 నుంచి బీజేపీకి అద్భుతమైన రోజులు గడుస్తున్నాయి. రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేశారు. కశ్శీర్ కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసి భారత్ లో పూర్తిగా కలిపేశారు. అయోధ్య సమస్యను పరిష్కరించి రాముడి గుడి కట్టేశారు. ఇలా రాజకీయంగా విజయాలతో పాటు తాము చేయాలనుకున్నవి చేస్తూ వచ్చారు. మూడో సారి ఎన్నికల్లో గెలవడానికి నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఎన్నికల  ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. పూర్తి మెజార్టీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన టీడీపీ, జేడీయూలు మంచి ఫలితాలు సాధించడంతో ఎన్డీఏకు ఎదురులేకుండా పోయింది. ఈ రెండు పార్టీలు గతంలోలానే బీజేపీకి సహకరిస్తున్నాయి. అందుకే పూర్తి మెజార్టీ లేని బీజేపీ అన్న భావన ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాదు బీజేపీ ఈ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. మహారాష్ట్ర, హర్యానాల్లో మళ్లీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ తో పాటు జార్ఖండ్‌లో మాత్రమే అధికారాన్ని పొందలేకపోయారు. ఎలా చూసినా జాతీయ  రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని స్థానం కొనసాగిస్తోంది. 

జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల వైభవం

చాలా కాలం తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి. తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యాయి. చంద్రబాబు, జేడీయూ చేతుల మీదుగా ప్రభుత్వం నడుస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగా ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మంచి ప్రయోజనాలు లభించాయని అంటున్నారు. రాజకీయంగానూ చంద్రబాబు, నితీష్ పేర్లు తరచూ ఢిల్లీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. 

కిందామీదా పడుతూ కాంగ్రెస్ పయనం

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పయనం ఓ అడుగు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా వంద సీట్లు సాధించి ఇక తిరుగులేదు అని ఆ పార్టీ తన భుజం తాను తట్టుకుంటున్న సమయంలో గెలిచిపోవాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడింది. మహారాష్ట్రలో అదే పరిస్థితి. జార్ఖండ్, జమ్మూకశ్మర్‌లలో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ అక్కడ మైనర్ భాగస్వామి. బీజేపీతో హోరాహోరీగా తలపాడాల్సిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ బోర్లా పడుతోంది. ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కావాలంటే కాంగ్రెస్ ను పక్కన పెట్టేసి ఇండియా కూటమికి మమతా బెనర్జీ నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాయి. ఆ దిశగా వచ్చే ఏడాది కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 

జాతీయ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కష్టమే !

బీజేపీకి భారీగా సీట్లు తగ్గిపోవడంతో మొత్తం పరిస్థితి మారిపోతుందని అనుకున్నామని కానీ.. బీజేపీకి నాలుగు వందల సీట్లు వచ్చినట్లుగానే పాలన సాగుతోందని .. నియంతృత్వ స్థాయిలోనే మోదీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ సందర్భంలో చెప్పారు. ఇది అక్షర సత్యం. ఎన్నికలు జరిగాయి. ఫలితాలువచ్చాయి. నెంబర్లుమారాయి కానీ బీజేపీ హవా, మోదీ హవాకు వచ్చిన ఢోకా ఏమీ ఈరకంగా చూస్తే ఈ ఏడాది కూడా బీజేపీదే  అని తేల్చేయవచ్చు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget